Begin typing your search above and press return to search.

పూజా హెగ్డే లాక్ డౌన్‌ టైమ్‌ ను వృదా కానివ్వడం లేదట

By:  Tupaki Desk   |   21 May 2021 7:30 AM GMT
పూజా హెగ్డే లాక్ డౌన్‌ టైమ్‌ ను వృదా కానివ్వడం లేదట
X
గత ఏడాది కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించారు. షూటింగ్ లకు కొన్ని నెలల పాటు బ్రేక్‌ పడింది. ఆ సమయంలో హీరోలు హీరోయిన్స్‌ రకరకాల పనులు చేస్తూ ఉన్నామంటూ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారు. కొందరు కొత్త కోర్సులను నేర్చుకుంటే మరి కొందరు కుటుంబంతో సరదాగా సమయంను గడిపారు. గత నెల రోజులుగా మరోసారి లాక్‌ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. ఈ సమయంలో మళ్లీ సినీ స్టార్స్ ఇంటికే పరిమితం అయ్యారు.

ఇంటికి పరిమితం అయిన స్టార్స్ గత ఏడాది మాదిరిగానే ఇప్పుడు కూడా కుటుంబంతో గడపడం లేదా కొత్త విషయాలను నేర్చుకునేందుకు కృషి చేస్తున్నారు. స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ప్రస్తుతం లాక్ డౌన్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటుందట. గతంలో ఈమెయిల్‌ కు వచ్చిన స్టోరీలు.. ఈమద్య కాలంలో వచ్చిన స్టోరీలను పూజా హెగ్డే చదువుతూ ఉందట. కొందరు రికార్డు చేసిన స్టోరీ లను వింటూ ఉందట. మొత్తానికి ఈ ఖాళీ సమయాన్ని వృదా కానివ్వకుండా మంచి కథలను ఎంపిక చేసుకునేందుకు వచ్చిన కథలన్నింటిని కూడా చదివేస్తోంది పూజా హెగ్డే.

ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌ కోలీవుడ్‌ బాలీవుడ్‌ ఇలా అన్ని వుడ్స్ లో కూడా బిజీగా ఉంది. తెలుగు లో ఈమె నటించిన రాధే శ్యామ్‌ మరియు మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఆచార్యలో కూడా కీలక పాత్రలో కనిపించింది. ఇంకా కొన్ని సినిమాల్లో కూడా ఈమె నటిస్తోంది. తమిళంలో సూపర్ స్టార్‌ కు జోడీగా నటించబోతుంది. ఇక హిందీలో సల్మాన్‌ ఖాన్ తో ఒక సినిమాను చేయబోతుంది. ఇంత బిజీగా సినిమాలు చేస్తున్న పూజా హెగ్డేకు కరోనా లాక్ డౌన్‌ కాళ్లు చేతులు కట్టేసినట్లుగా అయ్యింది. చేతిలో అన్ని సినిమాలున్నా కూడా ఖాళీగా ఉండటం చాలా బాధగా ఉందంటూ ఇటీవలే సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ కథలను చదువుతూ పూజా ఈ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటూ ఉంది.