Begin typing your search above and press return to search.

'సరిలేరు నీకెవ్వరు'లో శ్రీదేవి

By:  Tupaki Desk   |   1 Oct 2019 12:50 PM GMT
సరిలేరు నీకెవ్వరులో శ్రీదేవి
X
మహేష్‌ బాబు 26వ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో విజయశాంతి నటిస్తుండగా.. హీరోయిన్‌ గా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెల్సిందే. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రంను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనీల్‌ సుంకర మరియు దిల్‌ రాజులు సంయుక్తంగా ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. సినిమా క్రేజ్‌ ను పెంచేందుకు మరో హీరోయిన్‌ ను కూడా ఈ చిత్రంలో నటింపజేయాలని దర్శకుడు అనీల్‌ రావిపూడి భావిస్తున్నాడట.

ఇటీవలే 'గద్దలకొండ గణేష్‌' చిత్రంలో శ్రీదేవి అనే చిన్న పాత్రను చేసిన పూజా హెగ్డే చేసిన విషయం తెల్సిందే. ఆ పాత్రతో సినిమా స్థాయిని పూజా అమాంతం పెంచేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌ హీరోల మోస్ట్‌ వాంటెడ్‌ గా మారిపోయిన పూజా హెగ్డేను చిన్న పాత్ర కోసం అనీల్‌ రావిపూడి సంప్రదించాడని.. అందుకు ఆమె కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది అంటూ సమాచారం అందుతోంది. తెలుగులో ఈమె ప్రస్తుతం అల్లు అర్జున్‌ కు జోడీగా 'అల వైకుంఠపురంలో' మరియు ప్రభాస్‌ కు జోడీగా 'జాన్‌' చిత్రాల్లో నటిస్తోంది.

బాలీవుడ్‌ లో హౌస్‌ ఫుల్‌ 4 చిత్రాలతో పాటు రెండు మూడు చర్చల దశల్లో ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్నా కూడా మహేష్‌ బాబు మూవీ అవ్వడం వల్ల చిన్న పాత్ర అయినా కూడా పూజా హెగ్డే నటించేందుకు ఒప్పుకుంది. గద్దలకొండ గణేష్‌ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటించేందుకు గాను ఆమె భారీ మొత్తంలో పారితోషికంను తీసుకుంది. అంతకు మించి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రంకు గాను నిర్మాతలు ఇస్తామని ఆఫర్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో పూజా హెగ్డే కూడా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరుగనున్నాయి.