Begin typing your search above and press return to search.

'మహర్షి' అవసరంను పూజా ఇలా క్యాష్‌ చేసుకుంది

By:  Tupaki Desk   |   1 Feb 2019 11:42 AM GMT
మహర్షి అవసరంను పూజా ఇలా క్యాష్‌ చేసుకుంది
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం 'మహర్షి' మరి కొద్ది రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకోబోతుంది. ఏప్రిల్‌ చివరి వారంలో సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన పూజా హెగ్డే పిక్‌ ఒకటి కూడా బయటకు రాలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ గా, మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా ఉన్న పూజా హెగ్డే 'మహర్షి' చిత్రానికి గాను 1.75 కోట్ల పారితోషికంను తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్స్‌ ఇప్పటి వరకు పూజా ఖాతాలో పడింది లేదు. అరవింద సమేత చిత్రం పర్వాలేదు అనిపించినా, పూజాకు ఆ సినిమా అంతగా క్రేజ్‌ ను తెచ్చి పెట్టలేదు. అయినా కూడా మహర్షి మేకర్స్‌ ఈ చిత్రం కోసం పూజా హెగ్డేకు ఏకంగా 1.75 కోట్ల పారితోషికం ఇవ్వడం సినీ వర్గాల వారిని అవాక్కయ్యేలా చేస్తుంది. ఈ చిత్రం కోసం పూజా హెగ్డే డేట్లు ఎక్కువగా కేటాయించాల్సి ఉంటుందని, అంతే కాకుండా ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు కేటాయించాలని నిర్మాతలు కండీషన్‌ పెట్టడం వల్ల రెండు కోట్ల వరకు డిమాండ్‌ చేసిందని, ఫైనల్‌ గా 1.75కు ఫైనల్‌ అయినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహర్షి సినిమాకు తన అవసరం ఉంది కనుక పూజా హెగ్డే ఈ స్థాయి పారితోషికంను డిమాండ్‌ చేసిందని చెప్పుకోవచ్చు. సాక్ష్యం సినిమాకు కూడా భారీగానే ఈ అమ్మడు పారితోషికం తీసుకుందని, అయితే చిన్న హీరో అవ్వడం వల్ల ఆ రేంజ్‌ పారితోషికం ఓకే కాని, మహేష్‌ బాబుతో మూవీకి పూజా హెగ్డే ఈ స్థాయి పారితోషికం తీసుకోవడం అంటూ చెప్పుకోదగ్గ విషయం. మహర్షి సినిమాతో పూజా క్రేజ్‌ మరింత పెరుగుతుందా అనేది చూడాలి.