Begin typing your search above and press return to search.

సవతి తల్లి దెయ్యమే.. కాదంటున్న పూజా

By:  Tupaki Desk   |   18 Jan 2016 3:30 PM GMT
సవతి తల్లి దెయ్యమే.. కాదంటున్న పూజా
X
సెక్సీ బ్యూటీగా హాలీవుడ్ లో ఒకప్పుడు వెలిగిపోయిన పూజా బేడీ తండ్రి.. రీసెంట్ గా 70 వ పుట్టిన రోజు చేసుకున్నాడు. దానికి ఒక రోజు ముందు ఆయన నాలుగో పెళ్లి చేసుకోవడం విశేషం. పర్వీన్ దుసంజ్ ను కబీర్ బేడీ పెళ్లి చేసుకున్న సందర్భంగా .. పూజా బేడీ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది.

'ప్రతీ కథలోనూ ఓ చెడ్డ మంత్రగత్తె ఉంటుంది. నా జీవితంలో ఇప్పుడే దెయ్యం లాంటి సవతి తల్లి ఎంటర్ అవుతోంది. తండ్రి కబీర్ బేడి రీసెంట్ గా పర్వీన్ దుసాంజ్ ను పెళ్లి చేసుకున్నారు' అంటూ.. పూజా బేడీ ట్వీట్ చేసింది. నిజానికి ఈమెకు తన తండ్రి పెళ్లి విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు చాలానే ఎఫైర్స్ ఉన్నాయి. మొదటి పెళ్లి ప్రొతిమా బేడీని చేసుకున్నారు. ఈమెకు పుట్టిన కూతురే పూజాబేడీ. ఆ తర్వాత బ్రిటిష్ డిజైనర్ సుసాన్ హంఫ్రేస్ ను పెళ్లి చేసుకున్నారు కబీర్ బేడీ. నెక్ట్స్ అయితే టీవీ నటి నిక్కీ బేడీతో వివాహం జరిగింది. మరో నటి పర్వీన్ బాబీతో కూడా రిలేషన్ సుదీర్ఘ కాలం నడిచింది కానీ.. పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇప్పుడు పర్వీన్ దుసాంజ్ ను పెళ్లి చేసుకున్నారాయన. జస్ట్ తన తండ్రి నాలుగో పెళ్లిని జనాలకు చెప్పడమే ఈమె ఉద్దేశ్యం.

అయితే, ఈ ట్వీట్ దుమారం రేపడంతో.. ఆ దెయ్యం సవతితల్లి ట్వీట్ ని తొలగించింది పూజా బేడీ. తన ముందు ట్వీట్ ని తొలగించానని... ప్రతీ అంశాన్ని పాజిటివ్ గా చూడాలంటూ.. తండ్రి - సవతి తల్లిలకు బెస్ట్ విషెస్ చెప్పి మరో ట్వీట్ చేసింది పూజా బేడీ.