Begin typing your search above and press return to search.

సుశాంత్ సూసైడ్ కేసు: మరో నిర్మాతపై ప్రశ్నల వర్షం

By:  Tupaki Desk   |   27 July 2020 5:50 PM GMT
సుశాంత్ సూసైడ్ కేసు: మరో నిర్మాతపై ప్రశ్నల వర్షం
X
ఇటీవల ఓ ప్రముఖ జాతీయ చానెల్ తో మాట్లాడిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ సుశాంత్ ఆత్మహత్యకు ఓ సినీ మాఫియా కారణమని ఆరోపించింది. సినీ పరిశ్రమకు సంబంధం లేని ఫ్యామిలీల నుంచి హీరోలు.. ఆర్టిస్టులు వస్తే వారికి అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడింది. ఈ నేపథ్యంలోనే కరణ్ జోహార్, ఆదిత్యచోప్రా, మహేశ్ భట్ లను ‘సూసైడ్ గ్యాంగ్’ అంటూ సంచలన ఆరోపణలు చేసింది. వీరిని పోలీసులు ఎందుకు విచారించరని ప్రశ్నించింది.

ఈ ఆరోపణలు ప్రకంపనలు సృష్టించడంతో ముంబై పోలీసులు వెంటనే ఆదిత్య చోప్రాను విచారించారు. తాజాగా మహేష్ భట్, కరణ్ జోహార్ లను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

మహేష్ భట్ ను సోమవారం ఉదయం విచారించారు. 11.30 గంటల నుంచి ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో రెండున్నర గంటల పాటు విచారించారు. కరణ్ జోహార్ ను కూడా విచారించడానికి రెడీ అయ్యారు.

మొత్తానికి కంగనా రౌనత్ ఆరోపణల తర్వాత సుశాంత్ కేసులో అందరూ ఆరోపిస్తున్న వారు విచారణకు హాజరు కావడం ఆసక్తి నెలకొంది.