Begin typing your search above and press return to search.

ప్రముఖ యాంకర్ పై పోలీస్ కేస్.. షాక్ లో ఫ్యాన్స్!

By:  Tupaki Desk   |   5 May 2020 1:00 PM GMT
ప్రముఖ యాంకర్ పై పోలీస్ కేస్.. షాక్ లో ఫ్యాన్స్!
X
తెలుగు టీవీ యాంకర్ శ్రీముఖి.. ప్రస్తుతం తెలుగు టాప్ యాంకర్లలో ఒకరు. ఎన్నో టీవీ షోలు, రియాలిటీ ప్రోగ్రాంలు ఆమె చేతుల మీదగా సక్సెస్ చేస్తూ వస్తుంది. అయితే కొన్నిసార్లు కొన్ని టీవీ షోలు వివాదాలను కూడా తెస్తుంటాయి. అలా ఒక్కోసారి యాంకర్లపై కూడా పోలీసులు కేసులు పెట్టే పరిస్థితులు వస్తాయి. అలానే ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ – రన్నరప్, యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు. అసలు శ్రీముఖి పై పోలీస్ కేసు నమోదు కావడానికి కారణమేంటి? ఏం చేసిందంటూ కంగారు పడుతూ ఆరా తీస్తున్నారు. నల్లకుంటకి చెందిన శర్మ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు యాంకర్ శ్రీముఖి పై అలాగే ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ పై కేసు నమోదు చేశారట. ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో జరిగే ఓ ప్రోగ్రాంలో శ్రీముఖి బ్రాహ్మణులను అవమాన పరిచినందుకు నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వ్యక్తి కార్యక్రమ వీడియోలను కూడా చూపించాడట. బ్రాహ్మణులను కించపరిచే విధంగా కామెడీ షోలో దృశ్యాలను చిత్రీకరించారని ఓ ప్రముఖ టీవీ ఛానెల్, యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కామెడీ షోలో బ్రాహ్మణులను కించపరుస్తూ ఉన్నారంటూ వెంకట రమణ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వివాదం పై యాంకర్ శ్రీముఖి ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.