Begin typing your search above and press return to search.

కొత్త జంటపై పెటా కూడా ఆగ్రహం

By:  Tupaki Desk   |   3 Dec 2018 5:59 PM GMT
కొత్త జంటపై పెటా కూడా ఆగ్రహం
X
జంతు సంరక్షనే ప్రధాన ఉద్దేశ్యంతో ఏర్పాటైన పెటా తాజాగా పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా మరియు నిక్‌ జొనాస్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెటా అధికారిక సోషల్‌ మీడియా పేజ్‌ లో ప్రియాంక చోప్రా మరియు నిక్‌ లు వారి పెళ్లి సందర్బంగా గుర్రం మరియు ఏనుగులను ఇబ్బంది పెట్టారు అంటూ పోస్ట్‌ చేశారు. జంతువులను హించింసి వినోదం చేసుకోవడం ఏంటని, సెలబ్రెటీలుగా జాతీయ - అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న వీరు నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి వారే స్వయంగా జంతువును తమ వినోదం కోసం ఇబ్బంది పెట్టడంపై పెటా ఇండియా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెటా ఇండియా సీఈఓ మనిలాల్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. ప్రియాంక తన పెళ్లి కోసం జంతువులను ఇబ్బంది పెడుతుంటే కనీసం స్పందించలేదేం అన్నాడు. నిక్‌ గుర్రంపై ఎక్కి కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నాడు. గుర్రం మీద ఎక్కడం వల్ల స్థాయి పెరిగి గ్లామర్‌ గా కనిపిస్తానని భావించాడేమో కాని, గుర్రం మీద ఎక్కడ వల్ల ఆయన జంతు ప్రేమికుల ముందు చిన్నవాడయ్యాడు అన్నాడు.

పెళ్లిలో జంతువులను హింసించడం వల్ల పెటా ఆగ్రహంకు లోనైన ఈ కొత్త జంట, పెళ్లి సందర్బంగా భారీగా క్రాకర్స్‌ కాల్చడం వల్ల పర్యావరణ ప్రేమికుల ఆగ్రహంకు కూడా లోనయ్యారు. పెళ్లి అయ్యి కొన్ని గంటలైన కాకుండానే ఈ రెండు విషయాల్లో ఈ కొత్త జంట తీవ్రంగా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లి తంతు ముగించుకుని ముంబయి చేరుకున్న కొత్త జంట త్వరలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయబోతున్నారు.