Begin typing your search above and press return to search.

ఐదేళ్లుగా డిప్రెషన్ మాత్రలు వేసుకుంటున్నా.. అంటున్న ప్రముఖ హీరోయిన్

By:  Tupaki Desk   |   15 Jun 2020 10:11 AM GMT
ఐదేళ్లుగా డిప్రెషన్ మాత్రలు వేసుకుంటున్నా.. అంటున్న ప్రముఖ హీరోయిన్
X
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్యతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సినీ సెలబ్రిటీలు.. అభిమానులు ఖంగు తిన్నారు. ఎంఎస్ ధోని బయోపిక్‌తో సుశాంత్ సౌత్ జనాలకు కూడా సుపరిచితుడు అయ్యాడు. ఆ సినిమాతో లక్షల్లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎంతో మనో వేదనకు గురై సుశాంత్ ఈ పని చేసి ఉంటాడని తెలుస్తుంది. అంతే ఇప్పుడు డిప్రెషన్ అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఎప్పుడైనా డిప్రెషన్‌ అనిపిస్తే వెంటనే ఇతరులతో షేర్ చేసుకోవాలని అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు.

ఇక తాజాగా ప్రముఖ హీరోయిన్ పాయల్ ఘోష్ కూడా డిప్రెషన్ లో ఉన్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 2009లో ప్రయాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పాయల్. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. ఇక ప్రస్తుతం అడపాదడపా ఎప్పుడో ఒక సినిమాలో మెరుస్తున్న పాయల్.. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా.. తను గత ఐదేళ్లుగా డిప్రెషన్ తో ఇబ్బందిపడుతూ మెడిసన్స్ తీసుకుంటున్నట్లు చెప్పింది. అలాగే తనకు అలా డిప్రెషన్ అనిపిస్తే స్నేహితులకు, ఫ్యామిలీ మెంబర్స్ కు ఫోన్ చేసి మాట్లాడతానని.. అలా డిప్రెషన్ దూరం చేసుకుంటా అంటుంది అమ్మడు.

ఇంకా డిప్రెషన్ గురించి కొన్ని విషయాలు చెప్తూ.. మానసిక ఆరోగ్యం పై ప్రస్తావించి.. సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య పై చాలా బాధపడుతూ.. డిస్ట్రబ్ అయ్యానని చెప్పుకొచ్చింది. అంతేగాక తన అభిమానులను కూడా మానసిక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుతోంది. ఎప్పటకప్పుడు సెల్ఫ్ కేర్ తీసుకోవాలని.. ఏదైనా అవసరమైతే కుటుంబీకులను స్నేహితులను అడగాలని సూచించింది పాయల్. ప్రస్తుతం అమ్మడు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది.