Begin typing your search above and press return to search.

పీరియడ్స్ కు సంబంధించిన ఫోటోని షేర్ చేసిన పాయల్..!

By:  Tupaki Desk   |   25 March 2021 9:30 AM GMT
పీరియడ్స్ కు సంబంధించిన ఫోటోని షేర్ చేసిన పాయల్..!
X
'Rx 100' బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో తెలిసిందే. తనకు సంబంధించిన విషయాలతో పాటు నచ్చినవాటిని ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా పీరియడ్స్ (నెలసరి) కి సంబంధించిన ఓ ఫోటోని ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టింది. ఓ అమ్మాయి బస్ లో బహిష్టు కావడం, దానిపై పక్కనే ఉన్న ఓ అబ్బాయి స్పందించిన తీరు తెలుపుతూ గత కొన్ని రోజులుగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు అదే పిక్ ను షేర్ చేసింది పాయల్.

ఇందులో ఓ తండ్రి తన కూతురికి జరిగిన అనుభవాన్ని తెలియజేస్తూ.. తన కూతురు ఓ బస్‌ లో ప్రయాణిస్తుండగా మొదటిసారి పీరియడ్స్ జరిగాయని, ప్యాంటుపై రక్తపు మరకలు చూసి పక్కనే ఉన్న ఓ అబ్బాయి ఆ విషయాన్ని చెప్పి.. తన స్వెటర్ ఇచ్చి, నడుముకు చుట్టుకొని ఇంటికి వెళ్ళమని తన కూతురితో చెప్పాడని.. ఆ అబ్బాయిని అలా పెంచిన అతని తల్లికి నా ధన్యవాదాలు ఈ ఫొటోపై రాసి ఉంది. ఇది చూసిన పాయల్ ఆ ఫొటోని తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో పెడుతూ క్లాప్స్ కొట్టింది. జనాలను మేలుకొలిపే పోస్ట్ నుధైర్యంగా పెట్టిన పాయల్ ను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.

ఇంతకముందు యాంకర్ అనసూయ ఓ ప్రోగ్రామ్ లో భాగంగా తన మొదటి పీరియడ్స్ అనుభవాన్ని దైర్యంగా అందరితో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. పీరియడ్స్ అనేది ఏదో తప్పైనట్లు అందరూ వాటి గురించి మాట్లాడడానికి భయపడుతుంటారని.. ఇలాంటి విషయాలు దాచుకోకూడదని.. వాటి గురించి బాహాటంగా చెబితేనే ఈ తరం వాళ్లకు అర్థమవుతుందని అనసూయ తెలిపింది.