Begin typing your search above and press return to search.

మామయ్య చేతుల మీదుగా ఓపెనింగ్‌

By:  Tupaki Desk   |   12 March 2020 10:10 AM GMT
మామయ్య చేతుల మీదుగా ఓపెనింగ్‌
X
సాయి ధరమ్‌ తేజ్‌ ‘చిత్రలహరి’.. ‘ప్రతిరోజు పండుగే’ చిత్రాల సక్సెస్‌ తో స్పీడ్‌ పెంచాడు. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న సాయి ధరమ్‌ తేజ్‌ తదుపరి చిత్రాన్ని దేవా కట్టా దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు. నిన్న మొన్న వీరిద్దరి కాంబో మూవీ అంటూ వార్తలు వచ్చాయి. నేడు సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పవన్‌ కళ్యాణ్‌ హాజరు అయ్యాడు.

ఫిల్మ్‌ నగర్‌ టెంపుల్‌ లో ఈ సినిమా ప్రారంభోత్సవం లాంచనంగా నిర్వహించారు. ముహూర్తం షాట్‌ కు దేవుడి విగ్రహం ముందు పవన్‌ కళ్యాణ్‌ క్లాప్‌ కొట్టాడు. ఈ ఓపెనింగ్‌ కు అల్లు అరవింద్‌ తో పాటు ప్రముఖులు హాజరు అయ్యారు. దర్శకుడు దేవా కట్టాకు అల్లు అరవింద్‌ స్క్రిప్ట్‌ అందజేసి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. పొలిటికల్‌ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌ కు జోడీగా నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. పూజా కార్యక్రమాలకు ఆమె కూడా హాజరు అయ్యింది. భగవాన్‌.. పుల్లారావులు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ ను ఖరారు చేయలేదు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న దేవా కట్టా కాస్త గ్యాప్‌ తీసుకుని ఈ చిత్రంతో రీ ఎంట్రీకి సిద్దం అయ్యాడు. జోరుమీదున్న తేజ్‌ కు ఇది మరో హిట్‌ అవుతుందా చూడాలి.