Begin typing your search above and press return to search.

ఆ న‌టికి ఆన్ లైన్ బెదిరింపులు పెరిగిపోయాయ‌ట‌

By:  Tupaki Desk   |   27 Dec 2017 8:29 AM GMT
ఆ న‌టికి ఆన్ లైన్ బెదిరింపులు పెరిగిపోయాయ‌ట‌
X
ఏం జరిగినా.. మిగిలిన వారి కంటే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతోంది సోష‌ల్ మీడియా. కొన్ని సంద‌ర్భాల్లో త‌ప్పును త‌ప్పుగా చూపిస్తూ నిల‌దీస్తున్న సోష‌ల్ మీడియా.. మ‌రికొన్ని సార్లు మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అవుతోంది. ఈ కార‌ణంగా కొంద‌రు ప్ర‌ముఖులు ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. ఇదిలా ఉంటే.. మ‌రికొంద‌రు అత్యుత్సాహంతో చేస్తున్న వ్యాఖ్య‌లు సెల‌బ్రిటీల‌కు కొత్త క‌ష్టాల్ని తెచ్చి పెడుతున్నాయి. తాజా ఉదంతం ఇలాంటిదే.

ఇటీవ‌ల మ‌ల‌యాళంలో విడుద‌లైన క‌స‌బా చిత్ర హీరోయిన్ ఇలాంటి ఇబ్బందుల్నే ఎదుర్కొంటోంది. సోష‌ల్ మీడియాలో త‌న‌ను టార్గెట్ చేస్తున్నార‌ని.. త‌న‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని ఆమె వాపోతున్నారు. త‌న‌కు ఎదుర‌వుతున్న బెదిరింపుల నేప‌థ్యంలో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది పార్వ‌తీ టీకే. అవార్డు విన్నింగ్ న‌టిగా గుర్తింపు పొందిన ఆమె.. తాజాగా మీడియాతో మాట్లాడింది. ఆన్ లైన్లో బెదిరింపుల్ని ఎదుర్కొంటున్న‌ది తానొక్క దానినే కాద‌ని.. ఈ మ‌ధ్య‌న ఈ స‌మ‌స్య ఎక్కువ మంది హీరోయిన్లు ఎదుర్కొంటున్నార‌ని పేర్కొంది. ప‌లువురు హీరోయిన్లు సైబ‌ర్ బుల్లీయింగ్ బాధితులేన‌ని వెల్ల‌డించింది.

ఇటీవ‌ల కాలంలో ప‌లువురు మ‌హిళ‌లు ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నార‌ని.. ఓ వైవిధ్య‌భ‌రిత‌మైన అభిప్రాయాన్ని వెల్ల‌డించిన ప్ర‌తిఒక్క‌రికి ఇలాంటి ప‌రిస్థితే ఎదురువుతోంద‌ని ఆమె చెప్పారు. తాను ప‌ద‌కొండేళ్లుగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాన‌ని.. అభిమానులెంతో త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని.. ఇప్పుడు నోరు విప్పాల్సిన స‌మ‌యం వ‌చ్చింది కాబ‌ట్టి.. తాను స్పందించాల్సి వ‌చ్చింద‌ని పేర్కొంది. త‌న‌ను రేప్ చేస్తామ‌ని.. చంపేస్తామ‌ని.. యాసిడ్ పోస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని వాపోయింది.