Begin typing your search above and press return to search.

పరశురామ్ పారితోషికం అలా సెట్ చేసుకున్నాడట!

By:  Tupaki Desk   |   5 Jun 2020 3:20 PM IST
పరశురామ్ పారితోషికం అలా సెట్ చేసుకున్నాడట!
X
'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసుకునేందుకు దర్శకుడు పరశురామ్ కు చాలా సమయమే పట్టింది. అయితే ఎక్కువ కాలం వేచి చూసినప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడం మాత్రం గొప్ప విషయమే. ఈమధ్యే 'సర్కారు వారి పాట' సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు పరశురామ్ అందుకుంటున్న పారితోషికం గురించి ఇప్పటికే కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు పరశురామ్ రూ. 8 కోట్ల పారితోషికం ప్లస్ సినిమాకు వచ్చే లాభాల్లో 20% షేర్ తీసుకుంటున్నాడట. ఇందులో మొదట రూ. 4 కోట్లు అడ్వాన్స్ అందుకోబోతున్నాడని సమాచారం. ఇది పరశురామ్ కు భారీ రెమ్యూనరేషన్ అని చెప్పాలి. మహేష్ సినిమాకు మంచి లాభాలు కనుక వస్తే పరశురామ్ పారితోషికం మరింత భారీగా ఉంటుంది.

'గీత గోవిందం' సినిమాకు ఇలానే లాభాల్లో షేర్ తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్న కారణంగానే భారీ పారితోషికం అందుకున్నాడని.. ఇప్పుడు మహేష్ సినిమా విషయంలో కూడా అదే పధ్ధతి ఫాలో అవుతున్నాడని అంటున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాపై నెలకొన్న క్రేజ్ చూస్తుంటే భారీ బిజినెస్ చెయ్యడం ఖాయమని అంటున్నారు. ఎంత ఎక్కువ బిజినెస్ జరిగితే పరశురామ్ కు అంత మంచిది!