Begin typing your search above and press return to search.

సర్కారు వారి పాటకు డైరెక్టర్‌ ఎంత తీసుకుంటున్నాడంటే

By:  Tupaki Desk   |   1 Jun 2020 5:40 PM IST
సర్కారు వారి పాటకు డైరెక్టర్‌ ఎంత తీసుకుంటున్నాడంటే
X
‘గీత గోవిందం’ చిత్రంతో దర్శకుడిగా సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న పరశురామ్‌ ఎట్టకేలకు మహేష్‌ బాబుతో తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టాడు. మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమాను ఇటీవల కృష్ణ బర్త్‌ డే సందర్బంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంతో మహేష్‌ బాబు మరో విజయాన్ని దక్కించుకుంటాడనే నమ్మకంను ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ దర్శకులతో సినిమాలు చేసిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇప్పుడు పరశురామ్‌ తో సినిమాకు కమిట్‌ అవ్వడం అందరిని ఆశ్చర్యపర్చింది.

మహేష్‌ బాబుతో సినిమా కోసం చాలా కాలం వెయిట్‌ చేసి చివరకు నాగ చైతన్య తో సినిమాకు కమిట్‌ అయిన పరశురామ్‌ కు అనుకోని అవకాశంగా ఈ చిత్రం ఛాన్స్‌ దక్కింది. గీత గోవిదం చిత్రంకు గాను 9 కోట్ల వరకు పారితోషికం దక్కించుకున్న పరశురామ్‌ ఈ సినిమాకు 10 కోట్ల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

కెరీర్‌ లో బెస్ట్‌ పారితోషికంను దక్కించుకున్న పరశురామ్‌ ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ దక్కించుకుంటే మరింత పారితోషికం పెంచే అవకాశం ఉంది. మొత్తానికి సర్కారు వారి పాటతో దర్శకుడు పరశురామ్‌ కెరీర్‌ లో కొత్త రికార్డును నెలకొల్పబోతున్నాడు. ఈ చిత్రంలో మహేష్‌ బాబును విభిన్న పాత్రలో పరశురామ్‌ చూపించబోతున్నాడు. బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ సినిమా సాగుతుందని యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.