Begin typing your search above and press return to search.

సర్కారు వారి పాటలో మరో ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   28 Jun 2020 5:00 AM GMT
సర్కారు వారి పాటలో మరో ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 27వ చిత్రం సర్కారు వారి పాట చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మెల్లగా సాగి పోతున్నాయి. షూటింగ్‌ ప్రారంభంకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేయడంతో పాటు నటీనటుల ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే హీరోయిన్‌ కీర్తి సురేష్‌ తాను సర్కారి వారి పాట చిత్రంలో నటిస్తున్నట్లుగా ప్రకటించింది. తాజాగా మరో హీరోయిన్‌ పాత్ర కోసం ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌ నివేదా థామస్‌ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

దర్శకుడు పరశురామ్‌ ఇటీవలే సర్కారు వారి పాట చిత్రం కోసం నివేదా థామస్‌ ను సంప్రదించారట. హీరోయిన్‌ గానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా నివేధా నటిస్తూ మెప్పిస్తుంది. దర్బార్‌ చిత్రంలో రజినీకాంత్‌ కు కూతురు పాత్రలో నటించి ఈమె ఆకట్టుకుంది. ఇటీవల ‘వి’ చిత్రంలో కూడా ఈమె కీలక పాత్రలో నటించింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ దూసుకు పోతున్న ఈ అమ్మడు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’కు దాదాపుగా ఓకే చెప్పిందనే టాక్‌ వస్తుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బ్యాంకింగ్‌ రంగంలో జరుగుతున్న అవినీతి ప్రధాన అంశంగా రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేష్‌బాబు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడట. లుక్‌ పరంగా కూడా వైవిధ్యాన్ని కనబర్చబోతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. ఈ ఏడాది చివర్లో సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. ఒక భారీ బ్యాంక్‌ సెట్‌ నిర్మాణం ప్రస్తుతం హైదరాబాద్‌ లోని ప్రముఖ స్టూడియోలో చేపట్టారట. 14 రీల్స్‌.. మైత్రి మూవీ మేకర్స్‌ తో కలిసి మహేష్‌ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.