Begin typing your search above and press return to search.

'ప్రిన్స్'తో రొమాన్స్ చేయించనున్న పరశురామ్

By:  Tupaki Desk   |   1 May 2020 4:30 PM GMT
ప్రిన్స్తో రొమాన్స్ చేయించనున్న పరశురామ్
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి భారీ హిట్ తర్వాత ఇంతవరకు ఏ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా ఖరారు అయిందని తెలిసిందే. తాజాగా డైరెక్టర్ పరశురామ్ మీడియాతో మాట్లాడుతూ.. తను మహేష్ తో చేయబోయే తదుపరి సినిమా గురించి కొన్ని విషయాలు బయట పెట్టాడు. అంతేకాదు స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ ఫ్రెష్ ఫేస్ సారా అలీ ఖాన్ నటించబోతుందని ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అంతేగాక కీర్తిసురేష్, కియారా అద్వానీలు కూడా ఆ వరుసలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇంతకీ సూపర్ స్టార్ పక్కన నటించే హీరోయిన్ గురించి పక్కన పెడితే.. ఇక ఈ సినిమా మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని తెలుస్తోంది. మహేష్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పూర్తి స్థాయి రొమాంటిక్ ప్రేమకథతో ఈ సినిమా మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని సమాచారం. అంతేగాక ఈ సినిమాలో రొమాన్స్ తో పాటు యాక్షన్, తన మార్క్ కామెడీ కూడా ఉంటుందని పరశురామ్ తెలిపాడు. ఇక కరోనా మహమ్మారి తగ్గి అన్ని కుదిరితే ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందట. మరో ఆసక్తి వార్త ఏంటంటే.. ఈ చిత్రంలో మహేష్ కి విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్నారని సమాచారం. ఇక గోపీసుందర్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.