Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో పరశురామ్ పెట్లా మ‌ల్టీస్టార‌ర్..?

By:  Tupaki Desk   |   4 Feb 2022 12:30 PM GMT
ఎన్టీఆర్ తో పరశురామ్ పెట్లా మ‌ల్టీస్టార‌ర్..?
X
'యువత' సినిమాతోనే ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ పరశురామ్ పెట్లా.. 'గీత గోవిందం' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని టాప్ లీగ్ లో చేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలు - ఆర్థిక నేరగాళ్ల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని టాక్.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో వింటేజ్ మహేష్ ను ఆవిష్కరించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో పరశురాం కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ కొడతారనే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. దీంతో అప్పుడే దర్శకుడి తదుపరి సినిమా ఏంటనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పరశురామ్ ఓ మూవీ చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే పవర్ ఫుల్ క‌థ‌ను సిద్ధం చేసిన పరశురామ్.. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్టోరీ లైన్ ని ఆల్రెడీ తార‌క్ కి వినిపించారట. అయితే ఇందులో ఎన్టీఆర్ తో పాటు మ‌రో స్టార్ హీరో న‌టించే అవ‌కాశం ఉందని అంటున్నారు. అంటే ఇదొక మ‌ల్టీస్టార‌ర్ మూవీ. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చేసిన నందమూరి హీరో.. ఇప్పుడు పరశురామ్ చెప్పిన లైన్ పై ఆసక్తి కనబరుస్తున్నారట.

'శ్రీరస్తు శుభమస్తు' 'గీత గోవిందం' సినిమాల తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో దర్శకుడు మరో సినిమా చేయాల్సింది. సో ఇప్పుడు ఎన్టీఆర్ తో పరశురామ్ ప్రాజెక్ట్ నిజమే అయితే మాత్రం గీతా ప్రొడక్షన్ లో ఉండే అవ‌కాశం ఉంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇకపోతే యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో పరశురామ్ ఓ మూవీ కమిట్ అయిన సంగతి తెలిసిందే.

'సర్కారు వారి పాట' కంటే ముందుగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో చైతూతో ఓ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తుందనగా మహేష్ బాబు నుంచి పిలుపు ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారు. చైతన్య తో మూవీ క్యాన్సిల్ అవలేదని దర్శకుడు ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల 'బంగార్రాజు' ప్రమోషన్స్ లో నాగచైతన్య కూడా పరశురామ్ తదుపరి సినిమా తనతోనే ఉంటుందని చెప్పారు. మరి ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ ఎప్పుడుంటుందో చూడాలి.

ఇదిలా ఉంటే ఇప్పటికే మెజారిటీ భాగం పూర్తి చేసుకున్న 'సర్కారు వారి పాట'.. తాజాగా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే వారం నుంచి మహేష్ బాబు కూడా ఇందులో పాల్గొననున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ ప్లస్ - జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సమ్మర్ కానుకగా మే 12న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.