Begin typing your search above and press return to search.

మహానటి కోసం రూట్ మార్చిన పరశురామ్..!

By:  Tupaki Desk   |   25 May 2021 12:30 AM GMT
మహానటి కోసం రూట్ మార్చిన పరశురామ్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ పేట్లా తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''సర్కారు వారి పాట''. ఇందులో మహేష్ సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో దుబాయ్ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదే క్రమంలో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుతుండగా.. కరోనా ప్రభావం పడటంతో చిత్రీకరణ నిలిపేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తి పాత్ర గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

'స‌ర్కారు వారి పాట‌' సినిమాలో కీర్తి సురేశ్ క్యారెక్ట‌ర్ చాలా హిలేరియస్ గా ఉంటుంద‌ని అంటున్నారు. స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటమే కాకుండా.. కీర్తి పాత్ర హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తుందని టాక్. ముఖ్యంగా మహేష్ - కీర్తి సురేశ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరించేలా ఉంటాయట. వాస్త‌వానికి ప‌రుశ‌రామ్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్ట‌ర్లు చాలా సీరియ‌స్ గా ఉంటాయి. 'యువత' 'ఆంజనేయులు' 'సోలో' 'సారొచ్చారు' 'గీతగోవిందం'.. ఇలా ప్రతి సినిమాలోనూ హీరోయిన్ పాత్ర కాస్త సీరియస్ గా సాగుతుంది. కానీ ఈసారి 'సర్కారు వారి..' లో మాత్రం కీర్తి క్యారెక్ట‌ర్ ని పరాశురామ్ మోస్ట్ ఫ‌న్నీగా డిజైన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం.

'సర్కారు వారి..' సినిమా షూటింగ్ దాదాపు 25 శాతం వరకు కంప్లీట్ అయింది. ప‌రిస్థితులను బట్టి త్వ‌ర‌లోనే తదుప‌రి షెడ్యూల్ ప్లాన్ చేయాలని చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మధే సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ - 14 రీల్స్ ప్లస్ - మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మే 31న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 'సర్కారు వారి..' నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.