Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ అల్లుడి కోసం త్రివిక్ర‌మ్ రంగంలోకి

By:  Tupaki Desk   |   13 Jan 2022 6:36 AM GMT
ప‌వ‌ర్ స్టార్ అల్లుడి కోసం త్రివిక్ర‌మ్ రంగంలోకి
X
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా తెరంగేట్రం చేశారు పంజా వైష్ణ‌వ్ తేజ్‌. ప‌రిచ‌య‌మైన తొలి చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబట్ట‌డ‌మే కాకుండా ఓ డెబ్యూ హీరో మూవీగా బాక్సాఫీస్ వ‌ద్ద సంల‌చ‌నం సృష్టించి స‌రికొత్త రికార్డుని నెల‌కొల్పింది. ఒక డెబ్యూ హీరో సినిమా దాదాపు వంద కోట్ల క్ల‌బ్ లో చేర‌డం ఇదే తొలిసారి. దీంతో పంజా వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన `ఉప్పెన‌` ప్ర‌త్యేక‌మైన సినిమాగా రికార్డు సాధించింది. ఈ మూవీ త‌రువాత `కొండ పొలం`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన పంజా వైష్ణ‌వ్ తేజ్ పుట్టిన రోజు నేడు.

త్వ‌ర‌లో ఆయ‌న రెండు క్రేజీ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఇందులో ఒక‌టి బీవీఎస్ ఎప్ ప్ర‌సాద్ నిర్మిస్తుండ‌గా మ‌రో చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సాయి సౌజ‌న్య ఫార్చూన్ 4 సినిమాస్ పై సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి నిర్మించ‌బోతోంది. ఈ ప్రాజెక్ట్ ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ సెట్ చేశార‌ట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ప్ర‌త్యేక అనుబంధం వుండ‌టంతో ఆయ‌న మేన‌ల్లుడితో తాజా మూవీని త‌న క్రేజీ బ్యాన‌ర్ లో ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ ని పంజా వైష్ణ‌వ్ తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న ఫార్చూన్ 4 సినిమాస్, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం మేక‌ర్స్ ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టిస్తూ ఓ వీడియోని సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. ఈ వీడియోలో పంజా వైష్ణ‌వ్ తేజ్ కి రైజింగ్ స్టార్ అనే బిరుదుని కూడా ఇచ్చేశారు. ఇందులో మాసీవ్ అవ‌తార్ లో ఈ హీరోని చూపించ‌బోతున్నామంటూ ప్ర‌క‌టించారు.

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని వీడియో ఎండింగ్ లో పేర్కొన్న మేక‌ర్స్ ఇంత‌కీ ఈ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం వెల్ల‌డించ‌లేదు. అది ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. పంజా వైష్ణ‌వ్ తేజ్ థ‌ర్డ్ ప్రాజెక్ట్ ని బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `అర్జున్‌రెడ్డి` త‌మిళ రీమేక్ `ఆదిత్య వ‌ర్మ‌`కు డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన గిరీషాయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి `రంగ రంగ వైభ‌వంగ‌` అనే టైటిల్ ని ఫైన‌ల్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది.