Begin typing your search above and press return to search.

'ఏక్ మినీ కథ' చిత్రబృందానికి పాన్ ఇండియా స్టార్ విషెస్..!

By:  Tupaki Desk   |   21 May 2021 5:30 PM GMT
ఏక్ మినీ కథ చిత్రబృందానికి పాన్ ఇండియా స్టార్ విషెస్..!
X
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన యూవి క్రియేషన్స్ బ్యానర్ లో ఓవైపు భారీ బడ్జెట్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. మరోవైపు యూవి వారి సెకండ్ ప్రొడక్షన్ హౌస్ యూవి కాన్సెప్ట్స్ బ్యానర్ పై చిన్న సినిమాలకు ఆస్కారం లభిస్తుంది. అయితే యూవి కాన్సెప్ట్స్ బ్యానర్ లో మొదటి సినిమాగా తెరకెక్కింది 'ఏక్ మినీ కథ'. ఈ మూవీ ఇంతవరకు తెలుగు సినిమాల్లో ప్రస్తావించని ఓ బోల్డ్ పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ చూసిన వారికి'ఏక్ మినీ కథ' కాన్సెప్ట్ అర్ధం అయ్యుంటుంది. 'డస్ సైజ్ మేటర్..?' అనే బోల్డ్ పాయింట్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో సంతోష్ శోభన్, కావ్య తపర్ హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే తాజాగా ఈ ట్రైలర్ తో పాటుగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

ట్రైలర్ అయితే సినిమా పై ఆసక్తి రేపే విధంగానే ఉంది. ఎందుకంటే యూత్ ఫుల్ అంశాలు సినిమాలో పుస్కలంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అయితే మరి ఇంత బోల్డ్ పాయింట్ థియేటర్స్ లో చూస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ మేకర్స్ మాత్రం సినిమాను ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమాకు కథను అందించగా.. ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ తో పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. అలాగే కామెడీ కూడా యూత్ ను దృష్టిలో పెట్టుకొని క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఏప్రిల్ లో థియేట్రికల్ రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదాపడింది. మొత్తానికి సినిమా అమెజాన్ ప్రైమ్ లో మే 27 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ ముందు చేయాల్సిన హడావిడి మాత్రం బాగానే చేసేసారు మేకర్స్. తాజాగా ఈ సినిమాను బెస్ట్ విషెస్ తెలుపుతూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రభాస్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటి వర్షం. ఆ సినిమాను డైరెక్టర్ శోభన్ తెరకెక్కించాడు. కానీ ఆయన చనిపోవడంతో అతని కొడుకు సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ విషయం గురించి ప్రస్థావిస్తూ ప్రభాస్ పోస్ట్ పెట్టడం మనం చూడవచ్చు. 'వర్షం సినిమా నా కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి. అలాంటి సినిమా ఇచ్చినందుకు డైరెక్టర్ శోభన్ గారికి థాంక్స్. ఇప్పుడు ఆయన కొడుకు సంతోష్ శోభన్ నటించిన 'ఏక్ మినీ కథ' సినిమా ఏప్రిల్ 27న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. సంతోష్ - నా ఫ్రెండ్స్ యూవి క్రియేషన్స్ - ఎంటైర్ టీమ్ కి నా బెస్ట్ విషెస్" అంటూ ప్రభాస్ పోస్ట్ పెట్టాడు. ఈ సినిమాతో కార్తీక్ రాపోలు అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ట్రైలర్ అయితే పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది.