Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తితో ప్రాజెక్ట్ ని కన్ఫామ్ చేసిన పైడిప‌ల్లి

By:  Tupaki Desk   |   30 May 2021 6:30 AM GMT
ద‌ళ‌ప‌తితో ప్రాజెక్ట్ ని కన్ఫామ్ చేసిన పైడిప‌ల్లి
X
కెరీర్ లో గ్యాప్ తీస్కున్నా సాలిడ్ స్టెప్ తీసుకునే ప్లాన్ తో ఉంటారు వంశీ పైడిప‌ల్లి. ఆయ‌న కెరీర్ ఆరంభం నుంచి నంబ‌ర్ గేమ్ క్వాంటిటీ కంటే ప‌నిత‌నం ఉన్న సినిమాల‌పైనే దృష్టి సారిస్తున్నారు. గ్యారెంటీ రిలీజ్ ఉండే బ్యాన‌ర్ల‌తో ఆయ‌న సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయ‌న దిల్ రాజు కాంపౌండ్ ని అస్స‌లు విడిచిపెట్ట‌రు.

ఇటీవ‌ల దిల్ రాజు బ్యాన‌ర్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో మ‌హ‌ర్షి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించిన పైడిప‌ల్లి ఆ వెంట‌నే మ‌హేష్ తోనే సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నించి చివ‌రికి స్క్రిప్టు ప‌రంగా త‌డ‌బ‌డ్డారు. ఆ త‌ర్వాత చ‌ర‌ణ్ .. బ‌న్ని.. లాంటి స్టార్ల‌కు స్క్రిప్ట్ వినిపించే ప్ర‌య‌త్నం చేశార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ అవేవీ ఖాయం కాలేదు.

ఇంత‌లోనే స‌డెన్ ట్విస్ట్. త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ తో సినిమాని పైడిప‌ల్లి లాక్ చేసి షాకిచ్చారు. ఇప్ప‌టికే విజ‌య్ కి పైడిప‌ల్లి బౌండ్ స్క్రిప్ట్ వినిపించి లాక్ చేశారని క‌థ‌నాలొచ్చాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా మ‌రోసారి వంశీ పైడిప‌ల్లి ఈ విష‌యాన్ని అధికారికంగా క‌న్ఫామ్ చేశారు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ తో సినిమా కన్ఫామ్ అయ్యింది. అయితే ప్ర‌స్తుత క‌రోనా సందిగ్ధంలో ఈ విష‌యాన్ని మేం అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. కోవిడ్ శాంతించిన త‌ర్వాత నా కెరీర్ లో అతి పెద్ద‌ సినిమాని అధికారికంగా లాంచ్ చేస్తామ‌ని పైడిప‌ల్లి తెలిపారు. తాను స్వ‌త‌హాగా క‌థ‌కుడు కాక‌పోవ‌డంతో స్క్రిప్ట్ కోసం వేరొక‌రిపై ఆధార‌ప‌డుతున్నాన‌ని దానివ‌ల్ల కూడా సినిమాలు ఆల‌స్య‌మ‌వుతాయ‌ని పైడిప‌ల్లి వెల్ల‌డించారు. ఒక సినిమా చేసేప్పుడు ఇంకోటి చేసే అల‌వాటు లేద‌ని ఎందుకంటే చివ‌రి సినిమా రిజల్ట్ పైనే ద‌ర్శ‌కుడి భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంటుంద‌ని నిజాయితీగా త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ కి తెలుగులోనూ మార్కెట్ పెరుగుతున్న ఈ టైమ్ లో వంశీ పైడిప‌ల్లి అత‌డితో భారీ సినిమాని ప్లాన్ చేస్తుండ‌డం క్యూరియస్ టాస్క్. ఈ చిత్రానికి 200 కోట్ల బ‌డ్జెట్ పెట్టినా వ‌ర్క‌వుట‌య్యే ఛాన్సుంద‌నేది ఓ అంచ‌నా. మ‌రి దిల్ రాజు ఏ రేంజులో ప్లాన్ చేస్తార‌న్న‌ది వేచి చూడాలి. మ‌రోవైపు ఆయ‌న శంక‌ర్ -చ‌ర‌ణ్ క‌ల‌యిక‌లో పాన్ ఇండియా కేట‌గిరీలో మ‌రో భారీ చిత్రాన్ని సైమ‌ల్టేనియస్ గా ప్లాన్ చేస్తుండ‌డం మ‌రింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది.