Begin typing your search above and press return to search.

ఆమె ట్వేటేసింది.. వీరు చిందేస్తున్నారు

By:  Tupaki Desk   |   29 Aug 2017 8:09 AM GMT
ఆమె ట్వేటేసింది.. వీరు చిందేస్తున్నారు
X
మొన్నటి వరకు బాలీవుడ్ ని షేక్ చేసిన బిగ్ బాస్ షో ఇప్పుడు సౌత్ జనాలను కూడా తెగ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తెలుగు జనాలు అయితే ఈ రియాలిటీ షోకి దాసోహం అయ్యారనే టాక్ వినిపిస్తోంది. వెండి తెరపై అలరించిన జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండడంతో బుల్లి తెర ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ బిగ్ బాస్ షోని డైలీ ఫాలో అవుతున్నారు. కానీ తెలుగులో హిట్ అయిన విధంగా తమిళ్ లో హిట్ అవ్వలేదట. షో స్టార్టింగ్ నుంచే ఈ షోని బుల్లి తెర ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. కానీ తర్వాత షోపై వచ్చిన విమర్శలే రేటింగ్ ను తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా హీరోయిన్ ఓవియ వంటి నటులు షోలో పార్టీసీపీట్ గా అలరించడంతో ఆదరణ అందుకుంది.

అయితే తమిళ బిగ్ బాస్ నుండి ఒవియా వెళ్లిపోవడంతో షో రేటింగ్ మళ్ళీ తగ్గిపోయింది. అమెనీ మళ్ళీ రప్పించాలని యాజమాన్యం ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా చాలా మంది ఓవియా రావాల్సిందే అని ఎంతో పట్టుబట్టారు. ఆమెకు సోషల్ మీడియాలో చాలా ఆదరణ దక్కుతోంది. చాలా మంది అభిమానులు ఆమెను బిగ్ బాస్ కి రావాలని చాలా ప్రేమతో కోరుతున్నారు. దీంతో ఓవియా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మరో సారి తన అభిప్రాయాన్ని తెలిపింది. తనపై చూపిస్తున్న ప్రేమకు చాలా కృజ్ఞతలని మీ సపోర్ట్ ఉంటే చాలని ప్రతి ఒక్క వర్డ్ కి చాలా థాంక్స్ అని చెప్పింది. కానీ బిగ్ బాస్ విషయాన్ని గురించి ఏ మాత్రం స్పందించలేకపోయింది.

కాకపోతే మ్యాటర్ ఏంటంటే.. అసలు బిగ్ బాస్ యవ్వారం ముగిశాక ఒవియా తన ఎకౌంట్ నుండి వేసిన తొలి ట్వీట్ ఇదే. అందుకే ఇప్పుడు ఆమె అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. చిందులేస్తున్నారు. ఒక్క ట్వీటుతో ఇంత ఆనందం తేవొచ్చని ట్విట్టర్ కనిపెట్టినోళ్ళకి కూడా తెలిసుండదు సుమీ!!