Begin typing your search above and press return to search.

#PSPK 27 నుంచి క్రేజీ అప్డేట్...?

By:  Tupaki Desk   |   24 Jun 2020 11:10 AM GMT
#PSPK 27 నుంచి క్రేజీ అప్డేట్...?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'వకీల్ సాబ్' సెట్స్ పై ఉండగానే క్రిష్ సినిమా ఓకే చేసేశాడు పవన్. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. గతేడాది 'ఎన్టీఆర్ - కథానాయకుడు' 'ఎన్టీఆర్ - మహానాయకుడు' సినిమాలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పవన్ తో ఎలాగైనా హిట్ కొట్టి తన సత్తా ఏంటో చాటుకోవాలని అనుకుంటున్నారు దర్శకుడు క్రిష్. ఇప్పటికే హైదరాబాద్‌ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారని సమాచారం. అయితే కరోనా పరిస్థితుల వలన సినిమా షూటింగ్ ఆగిపోయింది.

ఇదిలా ఉండగా ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ - క్రిష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో కేవలం రెండు సాంగ్స్ మాత్రమే ఉండబోతున్నాయట. ఈ సాంగ్స్ కూడా కథలో భాగంగా సిచ్యుయేషన్ కి తగ్గట్టు ఉండబోతున్నాయట. ఇప్పటికే ఈ రెండు పాటలకు కీరవాణి ట్యూన్స్ రెడీ చేశారట. ఈ సినిమాలో కీరవాణి నుండి ఎక్కువ పాటలు ఆశించిన వారు మాత్రం నిరాశపడే న్యూస్ అని చెప్పవచ్చు. కాకపోతే పీరియాడిక్ మూవీ కావడంతో బ్యాగ్రౌండ్ స్కోర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నారట. కీరవాణి తన సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక 'వకీల్ సాబ్' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందట. కాగా మొఘలాయుల కాలంలో మంచి కోసం పోరాడే ఓ హిస్టారికల్ పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.