Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: రాజ‌మౌళి కంటే‌ మొండోడిలా ఉన్నాడు

By:  Tupaki Desk   |   11 April 2021 1:30 PM GMT
ట్రెండీ టాక్‌: రాజ‌మౌళి కంటే‌ మొండోడిలా ఉన్నాడు
X
ఓవైపు ముంబై సెకండ్ వేవ్ తో అట్టుడుకుతోంది. మ‌హారాష్ట్ర వ్యాప్తంగా కేసులో భయాన‌కంగా పెరుగుతున్నాయి. దీంతో బాలీవుడ్ షూటింగులు ఆపేశారు. లాక్ డౌన్ విధించ‌డంతో థియేట‌ర్ల‌లోకి సినిమాల్ని రిలీజ్ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి స‌న్నివేశంలోనూ ఆదిపురుష్ 3డి షూటింగ్ ని ఓంరౌత్ ఆప‌లేదు. స‌రిక‌దా మొండివాడిగా ఎంతో పంతంతో షూటింగ్ ని కొన‌సాగిస్తున్నాడు.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌హా చిత్ర‌బృందం ఆదిపురుష్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. COVID కేసులు నగరంలో పెరుగుతున్నా ఆ భ‌యాలు వీళ్ల‌లో క‌నిపించ‌డం లేదు‌. అనేక పెద్ద బడ్జెట్ సినిమాల షూటింగ్ ల‌ను ఆపేసి ఎవ‌రికి వారు ఇండ్ల‌కు చేరినా ఓంరౌత్ అండ్ టీమ పై ఎలాంటి ప్ర‌భావం చూపడం లేద‌ట‌.

షూట్ ఆప‌కుండా మొండిగా సాగిస్తున్నారు. ఓం రౌత్ ఆదిపురుష్ షూట్ పై మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ట‌. ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో.. మొత్తం టీమ్ చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తోంద‌ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని తెలిపారు. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. రక్తం చెమట ధార‌పోస్తున్నారు. మనస్సు పెట్టి ప‌ని చేస్తున్నారు. టీమ్ కి ఇదో పెద్ద‌ మిషన్.. అని ఓంరౌత్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఒకే ల‌క్ష్యం కోసం మేమంతా ప‌ని చేస్తున్నామ‌ని అత‌డు కాస్త క‌ఠినంగానే చెబుతున్నాడు. అత‌డి మొండి ప‌ట్టుద‌ల చూస్తుంటే రాజ‌మౌళి కంటే మొండోడిలా ఉన్నాడు! అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆదిపురుష్ చిత్రం‌లో బాలీవుడ్ తారలు సైఫ్ అలీ ఖాన్ రావ‌ణ్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. కృతి సనోన్ సీత పాత్ర‌లో న‌టిస్తోంది. ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీ సింగ్ లక్ష్మణ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11 న విడుదల కానుంది.