Begin typing your search above and press return to search.

వాళ్లను ప్రసన్నం చేసుకుంటేనే ఆఫర్లు : శ్రద్ధా

By:  Tupaki Desk   |   19 Jun 2020 5:15 AM GMT
వాళ్లను ప్రసన్నం చేసుకుంటేనే ఆఫర్లు : శ్రద్ధా
X
హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్యతో బాలీవుడ్‌ లో ఉన్న లొసుగులు ఒక్కొక్కటిగా మీడియా ముందుకు వస్తున్నాయి. ఫేవరెటిజం అక్కడ ఏ స్థాయిలో ఉంటుందో బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చే వారు ఎంతటి కష్టాలు పడాల్సి వస్తుందో తెలిసింది. ఎంతో మంది స్టార్స్‌ డిప్రెషన్‌ కు లోనవుతున్నారనే విషయం కూడా వెళ్లడయ్యింది. తాజాగా బాలీవుడ్‌ పై మరో హీరోయిన్‌ శ్రద్ధా దాస్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్కడ ఏళ్ల తరబడి కొనసాగుతున్న దారుణ పరిస్థితులను ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఎండకట్టింది.

బాలీవుడ్‌ లో కొత్త వారికి ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్‌ లేని వారికి ఆఫర్లు రావాలంటే ముంబయిలోని బాంద్రా ఇంకా జుహూ ప్రాంతాల్లో జరిగే నైట్‌ పార్టీలు.. పబ్‌ పార్టీలకు హాజరు అవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఉండే కొందరితో మంచిగా మెలిగితేనే ఆఫర్లు దక్కించుకోగలం. అలా కాకుండా వారిని దూరం పెట్టినట్లయితే ఇండస్ట్రీలో ఛాన్స్‌ లు అనేవి రావు. వారు దేవుడి ముందు ఉండే పూజారులు. వారిని ప్రసన్నం చేసుకుంటేనే వరాలు దొరుకుతాయి అంటూ శ్రద్దా పేర్కొంది.

సినిమాల్లో ఛాన్స్‌ లు దక్కించుకోవాలంటే డబ్బులు ఉన్నా లేకున్నా కూడా ఖరీదైన కార్లలో తిరగాల్సిందే.. వేలకు వేలు పెట్టి స్పాల్లో బ్యూటీషన్స్‌ తో అందాలకు మెరుగులు దిద్దించుకోవాలి ఇంకా పీఆర్‌ మేనేజర్లతో సన్నిహిత్యంగా ఉండాలి. అప్పుడే బాలీవుడ్‌ లో కనీసం ఆఫర్లు అయినా వస్తాయంటూ ఈ సందర్బంగా శ్రద్దాదాస్‌ సోషల్‌ మీడియాలో పేర్కొంది.