Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ అసలు షో షురూ

By:  Tupaki Desk   |   24 Aug 2021 3:30 PM GMT
ఎన్టీఆర్‌ అసలు షో షురూ
X
బిగ్ బాస్ వంటి అత్యంత వివాదాస్పద షో ను చాలా హుందాగా నడిపించి విమర్శలు లేకుండా చరిత్ర సృష్టించిన యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ సుదీర్ఘ విరామం తర్వాత బుల్లి తెరపై మళ్లీ ప్రత్యక్ష్యం అయ్యాడు. అర్థ సంవత్సర కాలంగా ఎన్టీఆర్‌ జెమిని టీవీలో షో చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అప్పటి నుండి కూడా ఎప్పుడెప్పుడు షో అంటూ ఆసక్తిగా జనాలు ఎదురు చూశారు. ఎట్టకేలకు మొన్న ఆదివారం ఎన్టీఆర్ హోస్ట్‌ గా జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రారంభం అయ్యింది. మొదటి రెండు ఎపిసోడ్స్ కూడా రామ్‌ చరణ్‌ గెస్ట్ గా కర్టన్ రైజ్ కార్యక్రమంగా సాగింది. నిన్నటి ఎపిసోడ్ ముగిసేప్పటికి రామ్ చరణ్‌ పాతిక లక్షలు దక్కించుకున్నాడు. బజర్ మోగడంతో షో ను నిలిపి వేశారు.

నేటి నుండి కంటెస్టెంట్స్ తో ఎన్టీఆర్ షో ఉండబోతుంది. రామ్ చరణ్‌ తు మచ్చట్లు సరదాగా సాగించిన ఎన్టీఆర్‌ ఇక మీదట కంటెస్టెంట్స్ తో సీరియస్ గా ఆటను ఆడాల్సి ఉంటుంది. అదే సమయంలో వారి ఫీలింగ్స్ ను వారి భావాలను అర్థం చేసుకుంటూ వారికి అనుగుణంగా ఆటను ముందుకు సాగించాల్సి ఉంటుంది. ఈ ఆటలు ఎన్టీఆర్‌ కు కొత్తేం కాదు. కనుక ఖచ్చితంగా కంటెస్టెంట్స్ తో కూడా అద్బుతంగా ఆటను ఆడించడంతో పాటు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయడం ఖాయం అంటూ బుల్లి తెర వర్గాల వారు మరియు ప్రేక్షకులు అంటున్నారు.

ఎన్టీఆర్ షో మొదలు కావడానికి కొన్ని గంటల సమయం ఉంది. అంతా కూడా ఎలా చేస్తాడో అనే అనుమానం ఏ కోశాన కూడా పెట్టుకోలేదు. కాని ఎన్టీఆర్‌ షో ఖచ్చితంగా రాక్ చేస్తుందని మాత్రం నమ్మకంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా షో కు సంబంధించిన నేటి ఎపిసోడ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కర్టన్ రైజింగ్‌ ఎపిసోడ్స్ కు ఖచ్చితంగా రికార్డ్‌ బ్రేకింగ్‌ రేటింగ్‌ వచ్చి ఉంటుంది. కనుక వీక్‌ డేస్ ఎపిసోడ్స్‌ ఎలా ఉంటాయి అనేది కూడా ఆసక్తికర పరిణామం. వచ్చిన కంటెస్టెంట్స్ ఎలాంటి వారు అయినా కూడా ఎన్టీఆర్ వారి నుండి ఆసక్తికర స్టఫ్‌ ను రాబట్టి షో ను రక్తి కట్టించడం ఖాయం.