Begin typing your search above and press return to search.

11ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ హీరోయిన్ రీఎంట్రీ..!

By:  Tupaki Desk   |   24 April 2021 7:54 AM GMT
11ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ హీరోయిన్ రీఎంట్రీ..!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా యాక్టింగ్ తో పాటు వేరే టాలెంట్ ప్రూవ్ చేసుకునేవారు చాలా తక్కువ. కానీ వేరే భాష నుండి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో పదేళ్లక్రితమే చక్రం తిప్పిన హీరోయిన్ మమత మోహన్ దాస్. తెలుగు ఇండస్ట్రీకి ఈ భామ హీరోయిన్ కంటే ముందు సింగర్ గా పరిచయమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా టైటిల్ సాంగ్ పాడిన మమత.. అదే ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో యాక్ట్రెస్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఆకలేస్తే అన్నం పెడతా.. అంటూ మెగాస్టార్ సినిమాలో కూడా సూపర్ హిట్ స్పెషల్ సాంగ్ పాడింది. తెలుగులో సింగర్ గా సక్సెస్ అయింది కానీ నటిగా సక్సెస్ కాలేకపోయింది. తెలుగులో యమదొంగ తర్వాత వెంకీతో చింతకాయల రవి, కింగ్ నాగ్ తో కేడి సినిమాలు చేసింది కానీ ఏ సినిమా కూడా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

ఆ తర్వాత అమ్మడు మళ్లీ తెలుగులో కనిపించలేదు. అదిగాక ఆమె లైఫ్ లోనే పెద్ద ప్రమాదాన్ని జయించింది. అదే క్యాన్సర్. అనంతరం మళ్లీ సినిమాలు ప్రారంభించింది. కానీ ఈసారి తమిళ మలయాళం వరకే అంకితమైంది. అయితే ఇప్పుడు మళ్లీ మమత తెలుగులో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మమత 'లాల్ భాగ్' అనే త్రిభాషా చిత్రంలో నటిస్తుంది. ప్రశాంత్ మురళీ పద్మనాభన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుందని టాక్. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతుందని సమాచారం. చూడాలి మరి దాదాపు 11ఏళ్ల తర్వాత మమత తెలుగులో సందడి చేయనుంది.