Begin typing your search above and press return to search.

కోటీశ్వరుడు కాస్త కోటీశ్వరులు ఎందుకు అయ్యింది?

By:  Tupaki Desk   |   24 Aug 2021 1:30 PM GMT
కోటీశ్వరుడు కాస్త కోటీశ్వరులు ఎందుకు అయ్యింది?
X
హిందీలో సెన్షేషనల్ సక్సెస్ అయిన కౌన్ బనేగా కరోడ్ పతి షో ను తెలుగు లో మీలో ఎవరు కోటీశ్వరుడు గా స్టార్‌ మా లో కొన్ని సంవత్సరాల క్రితం చేసిన విషయం తెల్సిందే. నాగార్జున మరియు చిరంజీవిలు ఆ షోకు హోస్ట్‌ గా వ్యవహరించారు. కొన్ని కారణాల వల్ల స్టార్‌ మా ఆ షోను వదిలేసింది. ఇప్పుడు అదే షో రైట్స్ ను జెమిని వారు దక్కించుకుని ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా చేస్తున్న విషయం తెల్సిందే. షో పేరును మీలో ఎవరు కోటీశ్వరుడు కాస్త ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చారు. ఛానల్‌ మారింది కనుక టైటిల్ మారిందని కొందరు అనుకున్నారు. కాని ఎన్టీఆర్‌ డెప్త్‌ గా ఆలోచించి ఆ తర్వాత మాత్రమే ఈ షో కు సంబంధించిన టైటిల్ ను మార్చినట్లుగా తాజా ఎపిసోడ్ తో క్లారిటీ వచ్చింది.

రామ్ చరణ్ తో ఎవరు మీలో కోటీశ్వరులు షో ను ప్రారంభించిన ఎన్టీఆర్‌ రెండవ రోజు షో గురించి మాట్లాడుతూ పేరు మార్పు పై స్పందించాడు. కోటీశ్వరుడు అనే పేరులో మగవారిని మాత్రమే ప్రస్థావించినట్లుగా ఉంది. ఈ షో కు ఆడవారు వస్తారు.. వారు కూడా గెలుచుకుంటారు కనుక ఎవరు మీలో కోటీశ్వరులు అని తానే మార్పించాను అంటూ చెప్పాడు. ఎన్టీఆర్‌ ఆ మాట చెప్పిన సమయంలో అంతా కూడా చప్పట్లతో మారు మ్రోగించారు. సోషల్‌ మీడియాలో కూడా ఎన్టీఆర్ దీర్ఘ దృష్టికి.. డెప్త్‌ విశ్లేషణకు ఫిదా అవుతున్నారు.

ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ ల సరదా సంభాషణలతో ఎవరు మీలో కోటీశ్వరుడు రెండవ ఎపిసోడ్‌ కూడా చాలా అహ్లాదబరితంగా సాగిపోయింది. ఈ షోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ రామ్‌ చరణ్‌ వ్యాఖ్యనిస్తూ ఎన్టీఆర్‌ కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి అక్కడ నుండి వెళ్లి పోయారు. ఇక నేటి నుండి కంటెస్టెంట్స్ తో ఆట కొనసాగబోతుంది. ఎవరు మీలో కోటీశ్వరులు షో ను ఎన్టీఆర్‌ ఎలా నిర్వహించబోతున్నాడు అనేది నేటి నుండి మరింత క్లారిటీ వస్తుంది.