Begin typing your search above and press return to search.

నా ఆస్తులన్ని అప్పులు తీర్చడానికి సరిపోవు.. వారే అండ!

By:  Tupaki Desk   |   25 May 2020 4:41 AM GMT
నా ఆస్తులన్ని అప్పులు తీర్చడానికి సరిపోవు.. వారే అండ!
X
టాలీవుడ్‌లో మెగా బ్రదర్ నాగబాబు మంచి నటుడు. అంతేగాక ఎదుటి వాళ్లను గుడ్డిగా నమ్మడంలో ముందే ఉంటారు. ఆయన జీవితంలో ఆరెంజ్ సినిమా నిర్మాణం పెద్ద దెబ్బ తీసింది. గతంలో రాంచరణ్ హీరోగా ఆరెంజ్ సినిమాను నాగబాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో నాగబాబు ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్నాడు. తాజాగా బ్రదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన బ్రదర్స్ మెగాస్టార్, పవర్ స్టార్ లను ఉద్దేశించి ఓ ఎమోషనల్ ట్వీట్ పోస్ట్ చేశారు. నాగబాబు మాట్లాడుతూ.. "నిజానికి ఆరెంజ్ సినిమా కష్టాల గురించి ఇప్పుడు చెప్పడం సరికాదు. కాకపోతే దర్శకుడిని నమ్ముకోవడం వల్ల నష్టాలు వచ్చాయి. ఆరెంజ్ సినిమా రిలీజ్ తర్వాత నేను నష్టపోయిన మొత్తం తెలిసి మైండ్ బ్లాక్ అయింది. ఆ సమయంలో ఎదురైన దారుణ పరిస్థితి ఎన్నడూ ఊహించలేదు.. అప్పుడు నా ఆస్తులన్నీ అమ్మినా నా అప్పులు తీరేవి కాదు" అని నాగబాబు అన్నారు.

అంతేగాక.. "నిజానికి ఆరెంజ్ సినిమా ఫెయిల్యూర్ కాదు. కానీ అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. నేను లెక్కలు చూసుకోవడంలో తప్పు జరిగింది. అయితే నా తప్పులను నుంచి బయటపడి నిజాలు తెలుసుకొన్నాను. తమ్ముడు, అన్నయ్యలపై ఆధారపడకుండా నేను టెలివిజన్‌లో నా కెరీర్‌పై దృష్టిపెట్టాను. జబర్దస్త్, ఇతర సీరియళ్లు నాకు మంచి పేరు, డబ్బును ఇచ్చాయి. అలాంటి కష్టాల్లో ఉన్నప్పడు నా తమ్ముడు పవన్ కల్యాణ్ బాగా సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత అన్నయ చిరంజీవి. వారిద్దరు రియాక్ట్ కావడంలో ఒకట్రెండు రోజులు తేడా మాత్రమే. జీవితంలో స్నేహితులను బాగా నమ్ముతాం. కానీ నా లైఫ్‌లో ఎప్పుడూ నా సోదరులే నాకు ప్రాణం అన్నారు. ఈ సందర్బంగా ట్వీట్ చేస్తూ.. "బ్రదర్స్ డే అనేది నేను గర్వించే రోజు. నా సోదరులుండే విధానం నాకిష్టం. నా జీవితంలోని కష్ట సుఖాల్లో.. మంచి చెడులలో ఎల్లప్పుడూ అండగా నిలిచారు. ఇప్పుడు మా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను' అని పేర్కొన్నారు. దీన్ని బట్టి అర్ధమవుతుంది నాగబాబుకి తన బ్రదర్స్ అంటే ఎంత ఇష్టమో.. ప్రాణమో..!