Begin typing your search above and press return to search.

మాస్ రాజా కొత్త సినిమా ఆగిపోయిందా..?

By:  Tupaki Desk   |   21 May 2020 2:30 AM GMT
మాస్ రాజా కొత్త సినిమా ఆగిపోయిందా..?
X
ప్రస్తుతం టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా సినిమా క్రాక్. ఇది ఒక పోలీస్ బ్యాక్ డ్రాప్ డ్రామా సినిమా. ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది. మొదటి నుండి ఈ చిత్రం ఒక తమిళ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే టీజర్ చూసాక అది నిజమేనని తేలింది. తమిళంలో సూపర్ హిట్ అయిన సేతుపతికి ఇది రీమేక్ అని తేలింది. ఇక దీని తర్వాత మాస్ రాజా మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. వీర సినిమా తీసిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడట. రమేష్ వర్మ కెరీర్ లో సాధించిన ఏకైక హిట్ రాక్షసుడు. ఆ సినిమా తమిళ హిట్ చిత్రం రాక్షసన్ కు రీమేక్. ఈ నేపథ్యంలో రవితేజతో రమేష్ వర్మ చేస్తోన్న చిత్రం కూడా రీమేక్ అని తేలింది.

తమిళంలో సూపర్ హిట్ అయిన 'సతురంగ వెట్టై 2' చిత్రంలో అరవింద్ స్వామి, త్రిష జంటగా సీక్వెల్ తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్స్ లో కనిపించనున్నాడట. ఒకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాగా, బిజినెస్ మ్యాన్ గా మరో పాత్రలో కనిపిస్తాడట. ఇక తాజాగా కరోనా ఎఫెక్ట్ రవితేజ సినిమాపై పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కరోనా వలన ఎన్నో సినిమాలు నిలిచిపోయాయి. ఈ సినిమా గురించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని పక్కన పెట్టి రవితేజ ఆ స్థానంలో వక్కంతం వంశీ సినిమాను ముందుగా పట్టాలు ఎక్కించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. క్రాక్ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతుంది. మరి రవితేజ - గోపీచంద్ కలయికలో హ్యాట్రిక్ గా రాబోతుంది. ఈ సినిమా పై అభిమానులలో అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి.