Begin typing your search above and press return to search.

త్రిపాత్రాభిన‌యం 10మంది నాయిక‌ల‌తో స‌ల్మాన్ ప్ర‌యోగం

By:  Tupaki Desk   |   18 Jun 2022 2:30 AM GMT
త్రిపాత్రాభిన‌యం 10మంది నాయిక‌ల‌తో స‌ల్మాన్ ప్ర‌యోగం
X
జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా స‌ల్మాన్ భాయ్ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌బీ ఈద్ క‌బీ దీపావ‌ళి - టైగ‌ర్ 3 లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న అత‌డు తాజాగా `నో ఎంట్రీ` మూవీ సీక్వెల్ కి స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ త్రిపాత్రాభినయం చేయ‌నుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అంతేకాదు.. ఏకంగా ఇందులో 10 మంది టాప్ స్టార్లు న‌టించ‌నున్నారు. 2005లో హిట్ కొట్టిన‌ నో ఎంట్రీ సీక్వెల్ కోసం స‌ల్మాన్ భాయ్ త‌న స‌హ‌చ‌రులు ఫర్దీన్ ఖాన్ -అనిల్ కపూర్ లతో క‌లిసి న‌టించ‌నున్నాడు.

ఖాన్ ల త్ర‌యంలో సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. అత‌డి నుంచి అన్ని ర‌కాల మ‌సాలాల‌తో పాటు పూర్తి వినోదాన్ని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకే అతని 2005 చిత్రం నో ఎంట్రీ సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నారు.  నో ఎంట్రీ- మే ఎంట్రీ అనే టైటిల్ తో తెరకెక్క‌నున్న ఇందులో సల్మాన్ ఖాన్- అనిల్ కపూర్- ఫర్దీన్ ఖాన్ త్రిపాత్రాభినయం చేయ‌నున్నారు. అంతే కాదు ఈ సినిమాలో మొత్తం 10 మంది హీరోయిన్లు నటించనున్నారు.

ఆస‌క్తిక‌రంగా ఇందులో భాయ్ మాత్ర‌మే కాకుండా.. అనిల్ కపూర్- ఫర్దీన్ కూడా ట్రిపుల్ రోల్స్ ప్లే చేయనుండ‌డంతో నాయిక‌ల కొర‌త ఎదుర‌వుతోంద‌ట‌. ఈ మూవీ గురించి చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. నో ఎంట్రీ సీక్వెల్ ని నిజానికి 2012లో ఖ‌రారు చేసారు. కానీ అప్పుడు చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌లేదు. ఇప్ప‌టికి మేకర్స్ ఈ చిత్రం లోని తారాగణం షూట్ గురించి మరికొంత సమాచారాన్ని అందించారు.  ముగ్గురు స్టార్లు త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారు కాబ‌ట్టే ప‌ది మంది నాయిక‌ల‌ను వెత‌కాల్సి ఉంటుంద‌ని కూడా సోర్స్ చెబుతోంది.

అయితే 2005 నో ఎంట్రీ లో న‌టించిన అందాల నాయిక‌లు బిపాసా బసు- లారా దత్తా- ఈషా డియోల్ - సెలీనా జైట్లీ సీక్వెల్ లో భాగం కాకపోవచ్చని తెలుస్తోంది. కానీ అదే టీమ్ ను తిరిగి సమీకరించడానికి మేకర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట‌. అయితే ప్రస్తుతానికి అది అంత సులువేమీ కాద‌ని వెల్ల‌డైంది. నో ఎంట్రీ మై ఎంట్రీ ఈ సంవత్సరం చివరి మూడు నెల‌ల్లో సెట్స్ కెళ్లే అవకాశం ఉంది.

ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం కానుందని ద‌ర్శ‌కుడు అనీష్ బ‌జ్మి ఇప్ప‌టికే వెల్ల‌డించారు. ``నేను సల్మాన్ భాయ్ ని నాలుగైదు సార్లు కలిశాను. అతను ఈ మూవీపై చాలా సీరియస్ గా ఉన్నాడు. మేము త్వరలో ప్రారంభిస్తున్నాం`` అని అనీస్ బజ్మీ చెప్పారు. నో ఎంట్రీ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. ఇది 2002 తమిళ చిత్రం చార్లీ చాప్లిన్ కి అధికారిక రీమేక్.