Begin typing your search above and press return to search.

నాగ్ అండ్ బాలయ్య.. సింక్ మిస్సయ్యింది

By:  Tupaki Desk   |   10 April 2017 12:54 PM GMT
నాగ్ అండ్ బాలయ్య.. సింక్ మిస్సయ్యింది
X

అసలు మా మధ్యన ఏమీ లేదు.. కేవలం మీడియా మాత్రమే అంతా క్రియేట్ చేసింది అంటూ మొన్ననే అక్కినేని నాగార్జున్ సెలవిచ్చారు. ఆయన సదరు మాట చెబుతున్నప్పుడు.. అవును నిజమే కదా.. మా మధ్యన నో ఇష్యూస్ యార్ అన్నట్లు బాలయ్య కూడా ఎక్సప్రెషన్ ఇచ్చారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది? కేవలం మీడియానే అపార్ధం చేసుకుని గాసిప్స్ రాసేసిందా?

నిజానికి అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజనం పరమపదిస్తే.. ఆయన పార్ధివ దేహాన్ని చూడ్డానికి కూడా బాలయ్య మాత్రం విచ్చేయలేదు. అప్పట్లో వీరిరువురి మధ్యనా కూడా తారాస్థాయిలో గొడవలు ఉండటం వలనే బాలయ్య అక్కడకు రాలేదని టాక్ వినిపించింది. హైదరాబాద్ లోనే ఉన్న బాలయ్య తన భార్యను అక్కడకు పంపించారు కాని.. ఆయన మాత్రం వచ్చిందేలేదు. ఆ తరువాత బాలయ్య ఇంట్లో పెళ్ళికి కూడా నాగ్ ఫ్యామిలీ నుండి ఎవ్వరూ రాలేదు. ఉత్తినే కారణం లేకుండా ఎవ్వరూ రాకుండా మానేయరు కదా. అందుకే నాగ్ కూడా కోపంగానే ఉన్నాడనే టాక్ బయటకు వచ్చింది. కాని ఇప్పుడేమో మేమిద్దరం దోస్త్ మేరా దోస్త్ టైపులే.. మీరు తప్పుగా అర్ధంచేసుకున్నారులే అంటున్నారు ఇద్దరూ.

ఆ లెక్కన చూస్తే.. అప్పుడు ఎందుకు రాలేదు మరి? అక్కడేదో సింక్ మిస్సయినట్లు అనిపించట్లేదూ? దాని గురించి ముందు మనోళ్ళు కాస్త వివరిస్తే.. అప్పుడే గాసిప్స్ అసలు ఎందుకు పుట్టాయో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. మరి నాగ్ అండ్ బాలయ్య ఏం చెప్తారో వేచి చూడాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/