Begin typing your search above and press return to search.

'థ్యాంక్యూ' ని కూడా కాస్త ప్రమోట్ చెయ్యండయ్యా..!

By:  Tupaki Desk   |   22 Jun 2022 8:30 AM GMT
థ్యాంక్యూ ని కూడా కాస్త ప్రమోట్ చెయ్యండయ్యా..!
X
అక్కినేని నాగచైతన్య మరియు డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ''థ్యాంక్యూ''. దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. జూలై 8న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం గమనార్హం.

'వెంకీమామ' 'మజిలీ' 'లవ్ స్టొరీ' 'బంగార్రాజు' వంటి బ్యాక్ టూ బ్యాక్ నాలుగు హిట్స్ తో ఫుల్ ఫార్మ్ లో ఉన్న నాగచైతన్య చేస్తున్న సినిమా ''థాంక్యూ''. అందులోనూ 'మనం' వంటి క్లాసిక్ తర్వాత చైతూ - విక్రమ్ కుమార్ కాంబోలో రాబోతున్న చిత్రం. అంతేకాదు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వంటి బడా బ్యానర్ లో రూపొందిన సినిమా. ఎస్ఎస్ థమన్ వంటి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేసిన మూవీ ఇది.

ఒక సినిమాపై క్రేజ్ ఏర్పడటానికి ఇంతకంటే ఏం అవసరం లేదు. కానీ 'థాంక్యూ' విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరుగుతోంది. రిలీజ్ కు ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నా.. ఇంతవరకు ఈ సినిమాపై ఎలాంటి సందడి కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

'థాంక్యూ' సినిమా నుంచి ఇప్పటికే టీజర్ మరియు రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. కానీ అవి సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేయలేదు. దీంతో అసలు ఆ కంటెంట్ ఎప్పుడు బయటకు వచ్చిందనేది కూడా చాలామంది జనాలకు తెలియలేదు. దీనికి కారణం మేకర్స్ సరైన రీతిలో ప్రమోట్ చేయకపోవడమే అని అక్కినేని అభిమానులు ఆరోపిస్తున్నారు.

దిల్ రాజు బ్యానర్ లో విజయ్ నటించిన 'వారసుడు' సినిమా ఫస్ట్ లుక్ ని మంగళవారం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీన్నుంచి సెకండ్ అండ్ థర్డ్ లుక్స్ ని కూడా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే తమిళ హీరో సినిమాకు ఇంత హడావుడి చేస్తున్నారు కానీ.. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి వచ్చే 'థాంక్యూ' చిత్రాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఫ్యాన్స్ నిర్మాతలను ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తాను నిర్మించే సినిమాలకు దూకుడుగా ప్రమోషన్స్ చేస్తుంటారు. ఇటీవల 'ఎఫ్ 3' మూవీకి ఏ రేంజ్ లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారో చూశాం. రెండు వారాల తర్వాత కూడా ఏదొక విధంగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని చూశారు. కానీ 'థాంక్యూ' ప్రమోషన్స్ లో ఆ జోష్ కనిపించడం లేదు.

ఇంతవరకు చైతన్య సినిమాకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి. థియేట్రికల్ ట్రైలర్ ఉంది.. ఎలాగూ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారు. 2 వీక్స్ లో హడావిడిగా ప్రమోట్ చేసే బదులు.. ఇప్పటి నుంచే రెగ్యులర్ గా ఏదో కంటెంట్ వదిలి సినిమాపై హైప్ క్రియేట్ చేయొచ్చు కదా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

దిల్ రాజు బ్యానర్ లో 'జోష్' సినిమాతో నాగచైతన్య హీరోగా లాంచ్ అయిన విషయం తెలిసిందే. కారణాలు ఏవైనా అది ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇన్నాళ్లకు ఇప్పుడు అదే ప్రొడక్షన్ లో చైతూ తో సినిమా చేస్తున్నారు. కచ్చితంగా హిట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అయినా సరే 'థాంక్యూ' కి పబ్లిసిటీ చేయడం లేదని అక్కినేని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద సినిమాను సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేసే థమన్ కూడా.. 'థాంక్యూ' సినిమాకి లైట్ తీసుకుంటున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు సాంగ్స్ జనాలకు ఏమాత్రం ఎక్కలేదని.. మిగతావి కూడా అలానే ఉంటే కష్టమని అంటున్నారు.

ఓటీటీల హవా నడుస్తున్న ఈరోజుల్లో ఎంత మంచి కంటెంట్ అయినా జనాలను థియేటర్లకు రప్పించడం చాలా కష్టమైపోయింది. గట్టిగా ప్రమోట్ చేసి వారి దృష్టిని ఆకర్షిస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అనేవి చాలా కీలకం కాబట్టి.. ప్రమోషన్స్ ను బట్టే ఓపెనింగ్స్ వస్తాయి. అందుకే ఇప్పటి నుంచైనా ''థాంక్యూ'' సినిమాకి ప్రచారం మొదలు పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

'థ్యాంక్యూ' సినిమాలో నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా - మాళవికా నాయర్ - అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. సుశాంత్ రెడ్డి - ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. బీవీఎస్ రవి ఈ చిత్రానికి కథ అందించగా.. లెజండరీ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.