Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తర్వాత నాగశౌర్యకు ఓకే

By:  Tupaki Desk   |   19 Jan 2018 6:17 AM GMT
ఎన్టీఆర్ తర్వాత నాగశౌర్యకు ఓకే
X
ఈ తరం హీరోయిన్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తమ రేంజ్ పెంచుకుంటూ వెళ్లాలని కొందరు హీరోయిన్స్ భావిస్తుంటారు. చక్కని పాత్ర అయితే.. ఎలాంటి మూవీలో అయినా చేసేస్తామని చెబుతుంటారు మరికొందరు హీరోయిన్స్. ఇంకొందరు అయితే.. తమ పర్సనల్ తర్వాతే.. ఏ సినిమా అయినా అంటున్నారు. టాలీవుడ్ లో వెలిగిపోతున్న నివేదా థామస్.. ఎంతటి సినిమా అయినా తన స్టడీస్ తర్వాతే అని చెప్పేయడమే కాదు.. చేసేస్తోంది.

జెంటిల్మన్.. నిన్ను కోరి అంటూ నానితో వరుసగా రెండు సినిమాలు చేసి సక్సెస్ కొట్టింది నివేదా థామస్. అదే జోరులో ఎన్టీఆర్ తో కలిసి జై లవకుశ మూవీలో ఆడిపాడగా.. ఇది కూడా విజయం సాధించింది. మూడు మూవీస్ విజయం సాధిస్తే.. ఇక ఆఫర్లకు కొదువ ఉండదు. కానీ ఈ చిన్నది మాత్రం సింపుల్ గా ఎగ్జామ్స్ పేరు చెప్పి బ్రేక్ తీసేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఓ సినిమాకు సై అన్నట్లుగా తెలుస్తోంది. కెమెరామ్యాన్ సాయి శ్రీరాం దర్శకుడిగా మారుతూ తెరకెక్కించనున్న ఓ సినిమాకు ఓకే చెప్పిందట నివేదా థామస్.

ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటిస్తుండగా.. నివేదా థామస్ కొత్త గెటప్ లో కనిపించనుంది. రీసెంట్ గా ఈమె బాబ్డ్ హెయిర్ కట్ చేయించుకుంది. ఆ మేకోవర్ నాగశౌర్య సినిమా కోసమే అంటున్నారు. అయితే.. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో తర్వాత.. మళ్లీ నాగశౌర్యతో సినిమా చేయడంలో ఈమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. తన పాత్ర నచ్చడంతోనే ఈ మూవీ యాక్సెప్ట్ చేశా అంటోంది నివేదా థామస్.