Begin typing your search above and press return to search.
పరీక్షలు ఓవర్.. వచ్చేస్తున్నా..
By: Tupaki Desk | 7 April 2018 10:44 AM ISTఅందమైన చిరునవ్వుతో పాటు కట్టిపడేసే నటన కేరళ కుట్టి నివేద థామస్ సొంతం. మొదటి సినిమా జెంటిల్ మెన్ తోనే బాగా యాక్ట్ చేసిందని పేరు తెచ్చుకుంది. అందుకే నానితో నటించిన నిన్ను కోరి సినిమాకు ఏరికోరి మరీ నివేదను హీరోయిన్ గా తీసుకున్నారు. టాలీవుడ్ కో టాలెంటెడ్ హీరోయిన్ దొరికిందని అనుకుంటున్న టైంలో ఉన్నట్టుండి లైమ్ లైట్ లో లేకుండా పోయింది.
నివేద చివరగా ఎన్టీఆర్ త్రిపాత్రిభియనం చేసిన జైలవకుశ సినిమాలో కనిపించింది. ఇందులో ముందు సినిమాలకన్నా కాస్తంత గ్లామర్ ఎక్కువే ఒలకబోసి ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంది. ఆ తరవాత నివేద ఏ మూవీకి సైన్ చేయలేదు. తన చదువు కంప్లీట్ చేయడం కోసమే ఈ బ్యూటీ సినిమాలకు ఇంటర్వెల్ ఇచ్చిందట. ప్రస్తుతం తీసుకున్న ఈ గ్యాప్ లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. దీనిపై తన అభిమానులకు స్వయంగా ఓ మెపేజ్ ఇచ్చింది. ‘‘నా తరవాత సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తానని చాలామంది అభిమానులు అడుగుతున్నారు. జైలవకుశ తరవాత నా గ్రాడ్యుయేషన్ లాస్ట్ సెమిస్టర్ కోసం కాస్త టైం తీసుకున్నా. ఇంక స్క్రిప్టులు చదవడం... స్టోరీలు వినే పనిలో పడ్డా. త్వరలోనే తాజా కబురు చెబుతా.. ప్రేమతో నివేద’’ అంటూ అభిమానులకు సందేశమిచ్చింది.
కెరీర్ లో పైకి వస్తున్నప్పుడు చదువును చాలామంది పక్కన పెట్టేస్తుంటారు. కానీ నివేద ఈ విషయంలో డిఫరెంటనే చెప్పాలి. చదువు కోసం సినిమా ఛాన్సులనే పక్కన పెట్టేసింది. ఇప్పుడు పరీక్షలైపోయాయి కాబట్టి సినిమాలు చేయడానికి రెడీ అంటోంది.
