Begin typing your search above and press return to search.

ఎన్టీవోడుకు ఆ ఇద్దరే దాదాపు ఫిక్స్

By:  Tupaki Desk   |   30 Jan 2017 10:30 AM IST
ఎన్టీవోడుకు ఆ ఇద్దరే దాదాపు ఫిక్స్
X
జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇప్పటికే వచ్చేసింది. కళ్యాణ్ రామ్ నిర్మాతగా.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో.. ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తున్నాడనే విషయం కూడా ఇప్పటికే అభిమానులతో పాటు ఆడియన్స్ కు కూడా చేరిపోయింది.

అయితే.. ఈ మూడు పాత్రల కోసం హీరోయిన్స్ వేట కొనసాగుతోంది. ఇప్పటికి ఇద్దరు హీరోయిన్స్ ను ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ బ్యూటీ రాశి ఖన్నాను ఇప్పటికే ఫైనలైజ్ చేసేశారట. అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయిపోయిందని.. యంగ్ టైగర్ తో రాశి రొమాన్స్ చూసేందుకు ఆడియన్స్ రెడీ అయిపోవచ్చని అంటున్నారు. మరోవైపు జెంటిల్మన్ బ్యూటీ నివేదా థామస్ తో చర్చలు ఫైనల్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఫైనల్ డెసిషన్ రాకపోయినా.. ఎన్టీఆర్ తో నివేద కాంబినేషన్ దాదాపు కన్ఫాం అయినట్లే అంటున్నారు సన్నిహితులు.

ఫిబ్రవరి 10న ముహూర్తం షాట్.. 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగనుండగా.. ''జై లవకుశ'' అనే టైటిల్ ని దాదాపు ఖాయం చేశారని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేయనున్న మూడో పాత్ర విలన్ అనే టాక్ గట్టిగానే ఉంది. ఈ రోల్ కి కూడా హీరోయిన్ ఉంటుదట కానీ.. ఇంకా ఎవరనే విషయంపై క్లారిటీ రాలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/