Begin typing your search above and press return to search.

ఆ పాతికవేలు అలానే దాచుకుందట

By:  Tupaki Desk   |   19 Jun 2016 10:28 AM IST
ఆ పాతికవేలు అలానే దాచుకుందట
X
మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందచందాలతోనే కాక నటన, గానం వంటి అంశాలలో కూడా ప్రావీణ్యం ప్రదర్శిస్తూ వెండితెరపై వెలుగుతున్న ఆణిముత్యంగా కీర్తిగడించింది. ప్రస్తుతం తారక్ - సుదీప్ - విక్రమ్ వంటి పెద్ద హీరోలతో నటిస్తున్న ఈ భామ తన వ్యక్తిగత విషయాలు కొన్ని మనతో పంచుకుంది. వాటి వివారాలు చూద్దామా

నిత్యకి పాటలంటే చిన్నప్పటి నుండీ ఇష్టమేనట. కాలేజీలో కేవలం పాటల పోటీలలో మాత్రమే పాల్గొనేదాన్నని, పెద్దయ్యాక అందరూ నేను సింగర్ అవుతానానుకునేవారని తెలిపింది.అప్పటికే ఎన్నో సినిమాలు చేసినా గుండె జారి గల్లంతయ్యిందే చిత్రంలో పాడిన పాటకు అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాతికవేళ పారితోషికం ఎంతో ప్రత్యేకమైంది కాబట్టే ఇప్పటికీ దాన్ని అలానే దాచుకున్నానని తెలిపింది.

టీనేజ్ లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డ నిత్యా కొంతకాలానికే అతనితో భవిష్యత్ ని ఊహించలేక ఆ బంధానికి స్వస్తిపలికిందట. ప్రస్తుతం ప్రేమ - పెళ్ళి లాంటి ఆలోచనలు పెట్టుకోలేదని చెప్పింది.ఫోన్ ని కేవలం సమాచారం కోసం వాడతాను కానీ సంభాషణకోసం కాదని, అందుకే తనకు ఫేస్ బుక్ - ట్విట్టర్ అకౌంట్ లు వుండవని ముగించింది నిత్యామీనన్.