Begin typing your search above and press return to search.

రాజమౌళీ.. ఆది చెల్లని టికెట్

By:  Tupaki Desk   |   30 Jun 2017 11:06 AM IST
రాజమౌళీ.. ఆది చెల్లని టికెట్
X
సినిమా ప్రచారంలో క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కడం సహజమే. ఎప్పటికప్పుడు మూవీ మేకర్స్ తమ సినిమా పబ్లిసిటీని డిఫరెంట్ గా చేయాలని ప్రయత్నిస్తుంటారు. యంగ్ హీరో నాని నటించిన నిన్ను కోరి మూవీ విషయంలో కూడా ఇలాంటి ప్రయత్నమే జరిగింది.

తాజాగా నిన్ను కోరి మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. సహజంగా ఇలాంటి ఫంక్షన్స్ లో ఆడియో సీడీనో.. లేకపోతే సినిమా పోస్టర్ నో ఆవిష్కరిస్తూ ఉంటారు. కానీ నిన్నుకోరి మేకర్స్ మాత్రం కొత్తగా ఆలోచించి.. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఓ మూవీ టికెట్ ను.. చీఫ్ గెస్ట్ రాజమౌళి చేతుల మీదుగా లాంఛ్ చేయించారు నిన్ను కోరి మేకర్స్. ఇదో కొత్త ఆలోచన కావడంతో చూసేందుకు కూడా డిఫరెంట్ గా ఉంది. అయితే.. నాని అండ్ టీం మాత్రం ఒక విషయం మాత్రం మర్చిపోయారు. ప్రసాద్స్ లో 150 రూపాయల మూవీ టికెట్ ని రాజమౌళితో లాంఛ్ చేయించారు.

కానీ నేచురల్ స్టార్ నటించిన నిన్ను కోరి రిలీజ్ అయ్యే నాటికి సినిమా టికెట్ రేట్లు పెరగనున్నాయని.. జూలై 1 నుంచీ జీఎస్టీ అమలవుతోందనే విషయాన్ని విస్మరించి.. కేవలం 150 రూపాయల టికెట్ ను లాంఛ్ చేయించారు. నిజానికి జూలై 1 నుంచి మూవీ టికెట్ ధరలు 200 రూపాయలు చేస్తున్నట్లు మొదటగా ప్రకటించినది ప్రసాద్స్ యాజమాన్యమే. డిఫరెంట్ గా ఆలోచించినా రియాలిటీని మర్చిపోయి.. ఓ చెల్లని టికెట్ ను గ్రాండ్ లాంఛ్ చేయించడం ఇప్పుడు కామెడీగా ఉంది నెటిజన్లకు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/