Begin typing your search above and press return to search.

మలుపు పాపను బోర్డర్ దాటిస్తున్నాడు

By:  Tupaki Desk   |   13 Dec 2016 3:57 AM GMT
మలుపు పాపను బోర్డర్ దాటిస్తున్నాడు
X
ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నారు అల్లు హీరోలిద్దరు. సక్సెలు.. బ్లాక్ బస్టర్లు.. 60-70 కోట్లలాంటివి బన్నీకి అలవాటయిపోయాయి. కానీ శిరీష్ మాత్రం రీసెంట్ గానే శ్రీరస్తు అంటూ సక్సెస్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు. అంతలోనే 1971: బియాండ్ బోర్డర్స్ అంటూ తెలుగు రాష్ట్రాల బోర్డర్లు దాటేసి కేరళ వెళ్లిపోయాడు.

ఇప్పుడీ సినిమాలో కృష్ణాష్టమి-మలుపు హీరోయిన్ నిక్కి గల్రానీని హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ భామ శిరీష్ తో జోడీ కడుతోంది. 'నిక్కీ గల్రానీకి టీంలోకి స్వాగతం. మొత్తానికి నీతో పని చేయబోతున్నారు. సరేకానీ నేను సీబీఎస్ ఈ తెలుసా? అంటే సెంట్రల్ బోర్డ్ కాదులే.. కార్పొరేట్ బాయ్స్ స్కూల్' అంటూ నాలుగు నవ్వులు కూడా పెట్టాడు అల్లు శిరీష్.

మూడేళ్ల క్రితం అరంగేట్రం చేసిన బుజ్జిగాడి మరదలి చెల్లెలు.. అప్పుడే పాతిక సినిమాల వరకూ వచ్చేసింది. తమిళ్-మలయాళంలో తెగ యాక్టింగ్ చేసేస్తోంది లెండి. కానీ టాలీవుడ్ లోనీ ఈమె కెరీర్ మలుపు తిరగలేదు. మరి ఇప్పుడు బోర్డర్స్ దాటించి తీసుకెళ్తానంటున్న అల్లు శిరీష్ ఏం చేస్తాడో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/