Begin typing your search above and press return to search.

నిఖిల్.. ఆ క్రేజీ సీక్వెల్ కు రెడీ

By:  Tupaki Desk   |   24 Oct 2019 10:25 AM GMT
నిఖిల్.. ఆ క్రేజీ సీక్వెల్ కు రెడీ
X
చందూ మొండేటి- నిఖిల్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కార్తికేయ' ఓ ఐదేళ్ళ క్రితం సంచలన విజయం సాధించింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడమే కాకుండా చందూ మొండేటికి దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్ పై కొన్ని వార్తలు వచ్చాయి కానీ అటు చందూ ఇటు నిఖిల్ ఇతర సినిమాలతో బిజీ కావడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు.

తాజా సమాచారం ప్రకారం 'కార్తికేయ-2' సినిమాకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా పెద్దగా హడావుడి లేకుండా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే ఈ సీక్వెల్ కోసం చందూ ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. ప్రీప్రొడక్షన్ వర్క్ చివరిదశకు చేరడంతో ఈ సినిమాను నవంబర్ లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తారు.

నిఖిల్ కొత్త సినిమా 'అర్జున్ సురవరం' నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఈసారి తప్పనిసరిగా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా ప్రమోషన్స్ పూర్తి కాగానే నిఖిల్ పూర్తి స్థాయిలో 'కార్తికేయ 2' సినిమాపై ఫోకస్ చేస్తాడని సమాచారం.