Begin typing your search above and press return to search.

‘కరోనా’కు అల‌వాటు ప‌డిపోయానుః హీరోయిన్

By:  Tupaki Desk   |   31 March 2021 1:30 PM GMT
‘కరోనా’కు అల‌వాటు ప‌డిపోయానుః హీరోయిన్
X
భవిష్యత్ లో కరోనాతో సహజీవనం చేయాల్సి వస్తుందని చాలామంది ప్రముఖులు అన్నారు. ఇప్పుడు వారిమాట‌లు నిజ‌మ‌య్యేలా క‌నిపిస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ చాలా దేశాల్లో అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. కొవిడ్ వైర‌స్ మాత్రం అదుపులోకి రావ‌ట్లేదు.

ఇప్పుడు దేశంలో సెకండ్ వేవ్ విజృంభించే ప‌రిస్థితులు క‌నిపిస్తుండ‌డంతో ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ప్ర‌జ‌లు కూడా భ‌యం భ‌యంగానే కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఇక డ్యూటీలు చేసుకునేవారు క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ప‌నులు చేసుకుంటున్నారు.

ఈ విష‌యంలో సినిమా ఇండ‌స్ట్రీ చాలా ప‌క‌డ్బందీగా ఉంది. ఏ ఒక్క‌రికి కొవిడ్ సోకినా.. యూనిట్ మొత్తానికీ పూసే అవ‌కాశం ఉంటుంది. అదే జ‌రిగితే.. వారాలు, నెల‌ల త‌ర‌బ‌డి షూటింగ్ వాయిదా ప‌డుతుంది. భారీ న‌ష్టాలు సంభ‌విస్తాయి. అందుకే.. క‌రోనా విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో సెట్లో అడుగు పెట్టే ప్ర‌తీఒక్క‌రు కొవిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. అయితే.. ఇలా తాను ఒక‌టీ రెండు సార్లు కాదు ఏకంగా 35 సార్లు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని ప్ర‌క‌టించింది నిధి అగ‌ర్వాల్‌. గ‌త అక్టోబ‌రు నుంచి షూటింగుల్లో పాల్గొంటున్నాన‌ని, ఇందుకో‌సం హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై ప్రాంతాల మ‌ధ్య తిరుగుతున్నాన‌ని తెలిపింది. దీంతో.. వెళ్లిన ప్ర‌తిసారీ టెస్టు చేయించుకోవాల్సి వ‌స్తోంద‌ని చెబుతోంది.

అయితే.. మొద‌ట్లో ఇబ్బంది ప‌డ్డ‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత అల‌వాటు ప‌డిపోయాన‌ని ప్ర‌క‌టించింది నిధి. ప్ర‌స్తుతం తెలుగులో ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న వీర‌మ‌ల్లు సినిమాలో న‌టిస్తోందీ బ్యూటీ