Begin typing your search above and press return to search.

ఆ సెట్ లో 'పూరి అండ్ కో' కి ప‌నేంటి?

By:  Tupaki Desk   |   4 April 2022 8:30 AM GMT
ఆ సెట్ లో పూరి అండ్ కో కి ప‌నేంటి?
X
డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ అండ్ కో కొన్నాళ్ల‌గా ముంబైలో తిష్ట వేసిన సంగ‌తి తెలిసిందే. `లైగ‌ర్` సినిమా ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి పూరి ప‌నుల‌న్నింటిని వాణిజ్య రాజ‌ధాని నుంచే న‌డిపిస్తున్నారు. హైద‌రాబాద్ లో సొంతిల్లు అయితే ఉందిగానీ కొన్నాళ్ల‌గా ఇక్క‌డ నుంచి ఎలాంటి యాక్టివిటీస్ కొన‌సాగించ‌లేదు. ఇటీవ‌లే `జ‌న‌గ‌ణ‌మ‌న` కొత్త సినిమా సైతం ముంబైలో నే లాంచ్ చేసారు. హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేకంగా ఆసినిమా క్రూని ముంబై తీసుకెళ్లి మ‌రీ అక్క‌డ ప్రారంభించారు.

పూరితో పాటు...చార్మీ పూరి క‌నెక్స్ట్ కి సంబంధించిన కొంత మంది కీల‌క స‌భ్యులు అందులో ఉన్నారు. `జేజీఎమ్` షూటింగ్ మొత్తం ముంబైలోనే ఫినిష్ చేసేలా టీమ్ ప్లానింగ్ లో ఉంది. అక్క‌డే అవ‌స‌రం మేర సెట్లు నిర్మించి పూర్తి చేయాల‌ని భావిస్తోందిట‌. అలాగే ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్టోరీ..అంత‌కు మించి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. అందుకే ముంబైలోనే ఈ సినిమా పూర్తిచేసే ప్లాన్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో పూరి బాలీవుడ్ ప‌రిచ‌యాల్నే ఎక్కువ‌గా వినియోగిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

తాజాగా పూరి..చార్మి -ర‌ణ‌వీర్ సింగ్ సినిమా సెట్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వంలో ` రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హాని` సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా సెట్ ని పూరి అండ్ కో సంద‌ర్శించినట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో పూరి ..చార్మి ర‌ణ‌వీర్ సింగ్ ని రౌండ‌ప్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ర‌ణ‌వీర్ కి అటు ఇటు నిల‌బ‌డి పూరి-చార్మీ ఫోటోలు దిగారు . ఒక ఫోటోలో క‌ర‌ణ్ జోహార్ కూడా క‌లిసారు.

ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మార‌డంతోనే విషయం వెలుగులోకి వ‌చ్చింది. పూరి ముంబైలో తిష్ట వేసిన ద‌గ్గ‌ర నుంచి స్టైల్ కూడా మార్చేసారు. హైద‌రాబాద్ లో ఉన్నంత కాలం పెద్ద‌గా ఎలాంటి హ‌డావుడి లేకుండా సింపుల్ గా ఉండే పూరి ముంబై వెళ్లిన త‌ర్వాత స్టైలిష్ గా మారిపోయారు. పూర్తిగా పోష్ క‌ల్చ‌ర్ కి అల‌వ‌డినట్లు తెలుస్తోంది.

పూరి కొత్త ఫోటోలో చినుగుల ప్యాంట్ ధ‌రించాడు. త‌న కిష్ట‌మైన బ్లాక్ క‌ల‌ర్ టీష‌ర్ట్ ధ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఛార్మి సాధార‌ణ దుస్తుల్లో క‌నిపిస్తున్నారు. ర‌ణ‌వీర్ సింగ్ న‌క్ష‌త్రాల డిజైన్ ఉన్న ఫ్యాంట్ మ్యాచింగ్ జీన్స్ ష‌ర్ట్ ధ‌రించాడు. ర‌ణ‌వీర్ తో పూరి ప‌రిచయం వెనుక క‌ర‌ణ్ జోహ‌ర్ ఉన్నార‌ని తెలుస్తోంది.

పూరి కనెక్స్ట్ తో క‌ర‌ణ్ `లైగ‌ర్` కోసం భాగ‌స్వామి అయిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి క‌ర‌ణ్ జోహ‌ర్ తో పూరి-చార్మి స‌న్నిహితంగా మెలుగుతున్నారు. పూరి ముంబై తిష్ట వెనుక క‌ర‌ణ్ కూడా ఓ కార‌ణం కావొచ్చు.