Begin typing your search above and press return to search.

అంత‌కంత‌కు యంగ్ ల‌య‌న్ లా ఆ స్వింగేంటీ!

By:  Tupaki Desk   |   18 May 2022 4:37 AM GMT
అంత‌కంత‌కు యంగ్ ల‌య‌న్ లా ఆ స్వింగేంటీ!
X
అమృతం సేవించిన దేవ‌త‌లు నిత్య‌య‌వ్వ‌నులుగా మారార‌ని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. అస‌లు ఎలాంటి అమృతం తాగ‌కుండానే కొంద‌రు ఇలలో దేవ‌తారూపంతో అల‌రిస్తుంటారు. ఇంద్రుడు చంద్రుడిలా వెలిగిపోతుంటారు. ఇదే కోవ‌కు చెందుతారు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఏజ్ 60 ప్ల‌స్ అనే భ్ర‌మ ఆయ‌న‌లో లేనే లేదు. ఏజ్ గేజ్ తో ప‌ని లేకుండా నిత్య‌య‌వ్వ‌నుడిగా ఎంతో యాక్టివ్ గా క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టికీ ఒక టీనేజ‌ర్ లా ఎంతో హుషారుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టించేస్తుంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతోందని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

బాల‌య్య‌లోని ఎన‌ర్జీని పూర్తి స్థాయిలో స‌ద్వినియోగం చేస్తే ఎలా ఉంటుందో అఖండ రిజ‌ల్ట్ చెప్పింది. ఆయ‌న ఎన‌ర్జీని అన్నివిధాలా ప‌రిపూర్ణంగా వినియోగించే ద‌ర్శ‌కుడిగా బోయ‌పాటికి హ్యాట్రిక్ రికార్డ్ ఉంది. ఇక ఇప్పుడు గోపిచంద్ మలినేని ముందు ఛాలెంజ్ అలానే ఉంది. అందుకే అత‌డు బాల‌య్య‌ను స‌రికొత్త యాంగిల్ లో తెర‌పై ప్రెజెంట్ చేసేందుకు చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఇది రియ‌ల్ స్టోరీని ఫిక్ష‌నైజ్ చేసి తెర‌కెక్కిస్తున్న సినిమా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో కలర్ ఫుల్ సెట్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. 'అఖండ' చిత్రానికి సంగీతం అందించిన ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి కూడా బాణీల‌ను అందించారు. అత‌డు షూటింగ్ స్పాట్ నుండి ఇదిగో ఇలా ఫోటోకి పోజులిచ్చాడు. థ‌మ‌న్ తో పాటు క‌థానాయ‌కుడు బాలకృష్ణ షేర్వాణిలో ఇస్మార్ట్ గా కనిపిస్తున్నారు. గోపీచంద్ మలినేని- శేఖర్ మాస్టర్ ఈ ఫోటోలో ఉన్నారు.

శ్రుతి హాసన్ తొలిసారి న‌ట‌సింహా స‌ర‌స‌న‌ కథానాయికగా కనిపించనున్న ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఓవైపు ఎన్టీఆర్- ప్ర‌శాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీపై దృష్టి సారించిన మైత్రి సంస్థ త‌దుప‌రి బారీ లైన‌ప్ తో దూసుకుపోతోంది. బాల‌య్య‌తో సినిమాని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది.

కెరీర్ స్వింగ్ జ‌ర‌జ‌ర‌..!బ్యాక్ టు బ్యాక్ మూడు నాలుగు ప్రాజెక్టులు బాల‌య్య‌ క్యూలో ఉన్నాయి. ఏప్రిల్ 18 నుంచి గోపిచంద్ మ‌లినేనితో షెడ్యూల్ ప్రారంభించి నాన్ స్టాప్ గా పూర్తి చేస్తున్నారు. ఇది సుదీర్ఘ షెడ్యూల్. ఈ భారీ షెడ్యూల్ లో మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తారు. ముఖ్యంగా బాల‌య్య పోర్ష‌న్స్ అన్నీ ఆల్మోస్ట్ పూర్తి చేసేస్తార‌ట‌. ఆ త‌ర్వాత ఎన్.బి.కే త‌న త‌దుప‌రి చిత్ర ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడితో ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తారు. మొత్తానికి రావిపూడితో ప్రాజెక్ట్ కోసం గోపిచంద్ మ‌లినేనికి డెడ్ లైన్ కూడా విధించార‌ట‌.

త‌దుప‌రి ఆదిత్య 369 సీక్వెల్ పైనా దృష్టి సారించాల్సి ఉంది. ఎన్.బి.కే న‌ట‌వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ మూవీ కోసం ఇప్ప‌టి నుంచే బాల‌య్య భారీ ప్లానింగ్ తో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ త‌న‌కు ఎంతో కీల‌క‌మైన‌ది. త‌న‌యుడిని స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో లాంచ్ చేయాల‌న్న ఆలోచ‌న కూడా బాల‌య్య కు ఉంది. మోక్ష‌జ్ఞ ఎంట్రీ మూవీ గురించి బోలెడంత చ‌ర్చ సాగింది. ఆదిత్య 369 సీక్వెల్ లో అత‌డు న‌టిస్తాడ‌ని బాల‌య్య అతిథిగా క‌నిపిస్తార‌ని.. 'ఆదిత్య 999 మ్యాక్స్' అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని కూడా ప్ర‌చార‌మైంది. ఈ మూవీ ఎన్.బి.కే లైఫ్ లోనే స్పెష‌ల్ మూవీ కానుందని స‌మాచారం.