Begin typing your search above and press return to search.

మళ్లీ టార్గెట్‌ అయిన సూపర్‌ స్టార్‌ డాటర్‌

By:  Tupaki Desk   |   1 July 2019 9:30 AM GMT
మళ్లీ టార్గెట్‌ అయిన సూపర్‌ స్టార్‌ డాటర్‌
X
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కూతురు సౌందర్య కొన్ని నెలల క్రితం తన హనీమూన్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తన సంతోషాన్ని పంచుకోవాలని భావించింది. అయితే ఆ సమయంలో పుల్వామ ఉగ్రదాడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉద్వేగ వాతావరణం నెలకొంది. జవాన్‌ లు చనిపోయి అంతా బాధపడుతున్న సమయంలో సౌందర్య తన హనీమూన్‌ పిక్స్‌ ను పోస్ట్‌ చేయడంతో నెటిజన్స్‌ ఆమెను దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు తాజాగా మరోసారి సౌందర్యపై నెటిజన్స్‌ సీరియస్‌ అవుతున్నారు.

గత కొన్నాళ్లుగా చెన్నై నగరం నీటి ఎద్దడితో ఏ స్థాయిలో అవస్థలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కూడా తీరడం లేదు. దాంతో పలు హోటల్స్‌.. సాఫ్ట్‌ వేర్‌ కంపెనీస్‌ తో పాటు పలు ప్రముఖ కంపెనీలు మూత పడ్డాయి. ఇంతటి దారుణమైన నీటి ఎద్దడి ఉన్న సమయంలో రజినీకాంత్‌ కూతురు సౌందర్య తన కొడుకుతో స్విమ్మింగ్‌ పూల్‌ లో స్విమ్‌ చేస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

సౌందర్య ఫొటోను చూడగానే జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు నీటి ఎద్దడితో చెన్నై రాష్ట్రం అవస్థలు పడుతుంటే మీరు స్విమ్మింగ్‌ పూల్‌ లో ఎంజాయ్‌ చేస్తున్నారా. మీకు కనీస బాధ్యత లేదు. నీరు వృదా చేయవద్దన్న కనీస ఆలోచన కూడా మీకు లేదా అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ ఆమెపై దుమ్మెత్తి పోశారు. ట్రోల్స్‌ తో వెంటనే ఆమె తన పోస్ట్‌ ను డిలీట్‌ చేయడంతో పాటు క్షమాపణలు చెప్పింది. అది గతంలో తీసుకున్న ఫొటో అని.. చిన్న పిల్లలకు చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్‌లో ప్రావిణ్యం ఉండాలనే ఉద్దేశ్యంతో తాను ఆ ఫొటోను షేర్‌ చేశానంటూ చెప్పే ప్రయత్నం చేసింది. దాంతో కాస్త నెటిజన్స్‌ తగ్గారు. అందుకే సెలబ్రెటీలు ఏం పోస్ట్‌ చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం సూపర్‌ స్టార్‌ డాటర్‌ కు రెండు సార్లు తెలిసి వచ్చింది.