Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: ఇక బుల్లితెర నటీనటుల వంతు...!

By:  Tupaki Desk   |   23 Sep 2020 5:33 PM GMT
డ్రగ్స్ కేసు: ఇక బుల్లితెర నటీనటుల వంతు...!
X
సినీ ఇండస్ట్రీని గత కొన్ని రోజులుగా డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్ బాంబ్ ప్రకంపనలు ఇప్పుడు బుల్లితెర నటీనటులను కూడా తాకాయి. యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్స్ ఫెడ్లెర్స్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలను ఎన్సీబీ విచారించగా.. తాజాగా డ్రగ్స్‌ వ్యవహారంలో బుల్లితెర నటీనటులను కూడా విచారిస్తున్నారు.

కాగా, ప్రముఖ టీవీ నటి అబిగేల్‌ పాండే మరియు ఆమె బాయ్ ఫ్రెండ్, కొరియోగ్రాఫర్‌ సనం జోహార్‌ నివాసాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరిద్దరిని ఎన్సీబీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా ఆదేశించగా.. నేడు ఈ జంట ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో మాదక ద్రవ్యాల సరఫరాతో వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో అధికారులు వీరిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఇక డ్రగ్స్ వ్యవహారంలో స్టార్‌ హీరోయిన్లు దీపికా పదుకునే - శ్రద్ధా కపూర్‌ - సారా అలీఖాన్‌ లతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో అధికారులు సమన్లు జారీ చేసినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.