Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో ఇద్దరి అరెస్ట్.. సుశాంత్ మేనేజర్ కు లింక్

By:  Tupaki Desk   |   2 Sep 2020 3:30 PM GMT
డ్రగ్స్ కేసులో ఇద్దరి అరెస్ట్.. సుశాంత్ మేనేజర్ కు లింక్
X
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కారణాలపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రగ్స్ మూలాలు బయటపడుతున్నాయి. తాజాగా ఇద్దరు వ్యక్తులను ఎస్.సీ.బీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసింది.

సుశాంత్ సింగ్ ఇంటిలో హౌస్ కీపింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్యాముల్ మిరిండాతో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారితో సంబంధాలున్నట్టు తేలింది. రియా సోదరుడు షోయిక్ కు కూడా లింకులు బయటపడ్డాయని సమాచారం.

సుశాంత్ కేసుకు సంబంధించి సీబీఐ ప్రధానంగా ఆయన మేనేజర్ శామ్యూల్ పై అనుమానపడుతోంది. సుశాంత్ ఇంటి వ్యవహారాలు అతడే చూసేవాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్ మూలాలు బయటపడడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సుశాంత్ తల్లిదండ్రులు కూడా మేనేజర్ శామ్యూల్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. ముంబైలోని ఉన్నత వర్గాలతో అతడు పార్టీలలో డ్రగ్స్ సరఫరా చేసేవాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నారు.