Begin typing your search above and press return to search.

ఆ డీల్స్ కు ఒప్పుకోకుండా 'జాతి రత్నాలు'ను కాపాడారుః నవీన్ పొలిశెట్టి

By:  Tupaki Desk   |   8 March 2021 3:33 AM GMT
ఆ డీల్స్ కు ఒప్పుకోకుండా జాతి రత్నాలును కాపాడారుః నవీన్ పొలిశెట్టి
X
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నవీన్‌ పొలిశెట్టి మొదటి సినిమాతోనే ట్యాలెంట్‌ ఉన్న కుర్రాడు అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈయన జాతి రత్నాలు సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో నవీన్ పొలిశెట్టి జోష్‌ అతడు షో ల్లో చేస్తున్న సందడి చూసి భవిష్యత్తులో మంచి స్టార్‌ అవుతాడంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాతి రత్నాలు ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ లో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ఏజెంట్‌ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో ఈ ప్రయాణం మొదలైంది. ఇప్పుడు జాతి రత్నాల వరకు వచ్చింది. ప్రభాస్‌ అన్న వల్ల డార్లింగ్ రత్నాలుగా.. విజయ్ దేవరకొండ వల్ల రౌడీ రత్నాలుగా ఈ సినిమా మారిపోయింది. ఎక్కడో యూట్యూబ్‌ వీడియోలు చేసుకుంటూ ఉండే వాళ్లం ఇలా మీముందుకు నాగీ.. స్వప్న.. ప్రియాంక గారు తీసుకు వచ్చారు. వారే ఈ సినిమాకు అసలైన రత్నాలు. హీరో అవ్వాలని వచ్చా కాని ఎవరిని కలవాలి ఎలా కలవాలి అనే విషయాలు తెలియవు. స్టూడియోల్లో ఎలా అప్రోచ్‌ అవ్వాలనే విషయం కూడా తెలియదు. అలాంటి సమయంలో ఓ ప్లాట్ ఫామ్‌ ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు కృతజ్ఞతలు.

పాన్ ఇండియా స్టార్‌ డం ఉన్న విజయ్ దేవరకొండను పదేళ్ల క్రితం థియేటర్ వర్క్ షాప్ లో కలిశాను. మళ్లీ ఇప్పుడు ఈ వేడుకకు ఆయన రావడం చాలా మెమోరబుల్‌ మూమెంట్‌. లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాకు ఓటీటీ నుండి చాలా ఆఫర్లు వచ్చాయి. కాని ఆ డీల్స్ కు ఒప్పుకోకుండా జాతి రత్నాలను కాపాడుకుంటూ వచ్చారు. సినిమా తో థియేటర్లలోనే ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయాలని జాతి రత్నాలను భద్రంగా కాపాడుకుంటూ వచ్చారు. నవ్వు జీవితంలో చాలా ముఖ్యం. ఆ నవ్వును మీతో పంచుకునేందుకు ఈనెల 11న వస్తున్నాం అన్నాడు.