Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ లోకి ఐస్ క్రీమ్ జంట

By:  Tupaki Desk   |   30 Sept 2017 10:08 AM IST
వెబ్ సిరీస్ లోకి ఐస్ క్రీమ్ జంట
X
జై సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యువ హీరో నవదీప్ తన పదమూడేళ్ల కెరీర్ లో ఎన్నో పాత్రలను చేశాడు. ఒకప్పటి వరకు హీరోగా అలరించిన ఈ యువ హీరో ఆ తర్వాత సైడ్ హీరో అయ్యాడు. అలాగే ప్రతి ప్రతి నాయకుడి పాత్రలోను అలరించాడు. ఇక బుల్లి తెరపై యాంకర్ గాను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇప్పటికి కి కూడా సినిమాల్లో కొన్ని స్పెషల్ పాత్రలకు నవదీప్ ఉండాల్సిందే.

రీసెంట్ గా తేజా - రానా కాంబినేషన్ లో తెరకెక్కిన "నేనే రాజు నేనే మంత్రి" సినిమాలో కనిపించిన నవదీప్ బిగ్ బాస్ షోలో కూడా కొన్ని రోజులు ఉన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. మొన్నటి వరకు అన్ని తరహా పాత్రలను చేసిన నవదీప్ ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా కనిపించబోతున్నాడు. శశాంక్ యేలేటి దర్శకత్వంలో 'మన ముగ్గురి లవ్‌ స్టోరీ’ అనే వెబ్‌ సిరీస్‌ ప్రసారం త్వరలోనే రాబోతోంది. ఈ విషయాన్ని నవదీప్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. వెబ్ సిరీస్ లోకి అడుగు పెట్టాను అంటూ.. భారత్‌ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలని ఈ వెబ్ సిర్సిస్ ద్వారా చేరుకోనున్నట్లు నవదీప్ తెలిపాడు.

ఇందులో నవదీప్ లీడ్ రోల్ లో నటిస్తుండగా హీరోయిన్ గా తేజస్వి నటిస్తోంది. ఇంతకుముందు వీరిద్దరూ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఐస్ క్రీమ్' సినిమాల్లో నటించారు. ఇక తేజస్వి చివరగా బాబు బాగా బిజీ అనే సినిమాలో నటించింది.