Begin typing your search above and press return to search.

మేజర్: అదే కారణమంటున్న నమ్రత

By:  Tupaki Desk   |   28 Feb 2019 8:58 AM GMT
మేజర్: అదే కారణమంటున్న నమ్రత
X
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత బ్యానర్ GMB (G. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్) పై నిర్మించనున్న మొదటి సినిమా 'మేజర్' ను నిన్నే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు దర్శకుడు. సోనీ పిక్చర్స్ రిలీజింగ్ ఇంటర్నేషనల్.. ఎ+ఎస్ మూవీస్ వారు బ్యానర్లు కూడా ఈ సినిమా నిర్మాణంలో GMB తో పాటుగా పాలుపంచుకుంటున్నాయి.

26/11 ఉగ్రవాద దాడులు జరిగిన సమయంలో తీవ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మేజర్ ఉన్నికృష్ణన్ దేశానికి అందించిన సేవలకు అయన మరణానంతరం అశోకచక్ర ను ప్రధానం చేశారు. ఇలాంటి నేషనల్ హీరో పాత్రలో అడివి శేష్ నటిస్తున్నాడు. అయినా ఈ సినిమాకు అసలు అడివి శేష్ ను దర్శకుడు శశికిరణ్ ను ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?

ఈ విషయాన్ని మహేష్ బాబు సతీమణి నమ్రత వెల్లడించారు. ఒక నేషనల్ హీరో కథను ప్రేక్షకులు చెప్పాలనే అడివి శేష్.. శశికిరణ్ ల విజన్ తమకు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసేందుకు ప్రేరణ ఇచ్చిందని చెప్పారు. వారి నిజాయితీ తమకు నచ్చిందని.. ఈ సినిమాకు వారిద్దరిని ఎంచుకోవడానికి కారణం అదేనని చెప్పారు. ఇక తమ GMB బ్యానర్ గురించి వివరిస్తూ.. ప్రపంచంలోని నలుమూలల ఉండే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే స్టొరీలను చెప్పేందుకు GMB అనేది ఒక ప్లాట్ ఫామ్ గా ఉండాలనేది తమ ఆలోచన అన్నారు.