Begin typing your search above and press return to search.

ఆ విషయంలో మహేష్ ను సతీమణి నమ్రత కన్విన్స్ చేసిందట..!

By:  Tupaki Desk   |   17 July 2021 2:30 AM GMT
ఆ విషయంలో మహేష్ ను సతీమణి నమ్రత కన్విన్స్ చేసిందట..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాలతో ఇటు కమర్షియల్ యాడ్స్ తో బిజీబిజీగా గడుపుతుంటారు. అదే సమయంలో ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేస్తుంటారు. ఇక మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా గతంలో హీరోయిన్ గా చేసి ఉండటంతో.. పిల్లలతో ఫ్యామిలీ అంతా ఒకే స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఆశ పడుతుంటారు. అయితే ఈ కల 2019 దీపావళి సందర్భంగా వచ్చిన 'సాయి సూర్య డెవలపర్స్' టీవీ యాడ్ ద్వారా సాకారం అయిందని చెప్పాలి. ఈ యాడ్ లో మహేష్ తో పాటుగా భార్య నమ్రత - కొడుకు గౌతమ్ కృష్ణ - కూతురు సితార కలిసి నటించారు. ముప్పై సెకన్ల పాటు ఉండే ఈ కమర్షియల్ ప్రకటన యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాబట్టి సూపర్ సక్సెస్ అయింది. మహేష్ ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే స్క్రీన్ పై చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే సూపర్ స్టార్ ఫ్యామిలీని ఒక యాడ్ లో చూపించింది యాడ్ ఫిల్మ్ మేకర్ యమునా కిషోర్ అని చాలా తక్కువ మందికే తెలుసు.

తాజాగా యమునా కిషోర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు ఫ్యామిలీతో కమర్షియల్ యాడ్ చేసిన నాటి సంగతులను వివరించాడు. అప్పటికే అదే కంపెనీ కోసం మహేష్ తో ఓ సోలో యాడ్ చేశానని.. కుటుంబం మొత్తంలో యాడ్ చేయాలనే ఆలోచన తనదే అని తెలిపారు. చేస్తారా లేదా అనే డౌట్ ఉన్నప్పటికీ ఒకసారి ప్రయత్నించి చూద్దామని.. ఈ ప్రపోజల్ ని హీరో ఫ్యామిలీ ముందు పెట్టానని అన్నాడు. ''నమ్రత మేడమ్ కూడా ముందు కన్విన్స్ అవ్వలేదు. నేను యాక్ట్ చేసి కొన్నేళ్లు అయింది. ఇప్పుడు ఎందుకులే వద్దు అన్నారు. మహేష్ బాబు గారు చాలా రోజులు కన్విన్స్ అవలేదు. ఏదైనా సోలోగా సింపుల్ కాన్సెప్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేవారు. కానీ అది రొటీన్ గా ఉంటుంది సార్. నన్ను నమ్మండి అని చెప్పి రెండు నెలలు గ్రౌండ్ వర్క్ చేసి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రతీ విషయం పై నమ్మకం కలిగించిన తర్వాతే షూట్ కి వెళ్ళాం'' అని కిషోర్ తెలిపారు.

మహేష్ బాబు ఫ్యామిలీ అంతా నటిస్తున్నారు అంటే అంచనాలు ఉంటాయని.. అందులోను భార్యా పిల్లలతో కలిసి నటించడం అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి బాగా ఆలోచించారని కిషోర్ చెప్పాడు. ''ఈ విషయంలో ముందు నన్ను నమ్మింది నమ్రత గారు. దీని గురించి మహేష్ గారికి చెప్పి చాలా వరకు నాకు సపోర్ట్ గా నిలిచారు. కొన్ని రోజుల తర్వాత మహేష్ గారికి కూడా నమ్మకం కలిగింది'' అని చెప్పుకొచ్చాడు. యాడ్ చేసిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో దీని గురించి చాలా గొప్పగా చెప్పారని.. నా ఫ్రెండ్ యమున కిషోర్ నన్ను కన్విన్స్ చేసారని చెప్పారని.. అప్పుడు నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని అనుకున్నామని యాడ్ ఫిలిం మేకర్ తెలిపారు. రెండు నెలల గ్రౌండ్ వర్క్ చేసిన ఆ యాడ్ ని 4 గంటల్లో తీసామని.. అన్ని షాట్స్ ఫ్యామిలీ అంతా సింగిల్ టేక్ లో చేసేశారని.. యాడ్ సూపర్ హిట్ అయిందని కిషోర్ చెప్పారు. ఇకపోతే మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలసి నటించిన ఆ ముప్పై సెకండ్ల యాడ్ కోసం ఏకంగా ఆరు కోట్ల వరకు తీసుకున్నారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.