Begin typing your search above and press return to search.

ఇలా చేస్తే కరోనా రాదంటున్న స్టార్ హీరో!

By:  Tupaki Desk   |   25 Jun 2020 5:30 PM GMT
ఇలా చేస్తే కరోనా రాదంటున్న స్టార్ హీరో!
X
మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని టాలీవుడ్‌ అగ్రహీరో నాగార్జున అక్కినేని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ట్వీట్‌ చేశారు. కరోనా సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే మానసికంగా, శారీరకంగా, దృఢంగా ఉండటమే ప్రతి ఒక్కరికి ప్రధాన ఆయుధమని వివరించారు. మోడల్‌, న్యూట్రిషనిస్ట్‌‌, ఫ్యాషన్‌ డిజైనర్‌, తన స్నేహితురాలు శిల్పారెడ్డి, ఆమె భర్త కరోనా బారిన పడ్డారని, అయితే వారు కరోనా విజయవంతంగా జయించారని వెల్లడించారు. ఈ క్రమంలో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన తర్వాత, చికిత్స సమయంలో తాము ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నామో వివరిస్తూ శిల్పారెడ్డి ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వీడియోను నాగార్జున తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా ఆమె చెప్పిన ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా వినండి అంటూ ఫ్యాన్స్‌కు సూచించారు.

ఇక ఆ వీడియోలో తమకు కరోనా సోకడానికి గల కారణాలను శిల్పారెడ్డి వివరించారు. తనకు, తన భర్తకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదన్నారు. కాస్త అస్వస్థతకు లోనవ్వడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు. తగిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారం, డైట్‌ పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చని వివరించారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలిపారు. అదే విధంగా ప్రతిరోజు తప్పక వ్యాయామం చేయాలని. ప్రాణాయామం చేయడం తప్పనిసరి అని తెలిపారు. నటుడు సామ్రాట్‌ సోదరి అయిన శిల్పారెడ్డి టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ సమంతకు మంచి స్నేహితురాలు. అంతేకాకుండా అక్కినేని కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఈ క్రమంలో శిల్పారెడ్డికి, ఆమె భర్తకు కరోనా అని తేలడంతో ఆమె అభిమానులతో పాటు అక్కినేని అభిమానులు కూడా కలవరానికి గురయ్యారు.

కరోనా వైరస్‌కు సామాన్యుడు ధనవంతుడు అనే తేడాలు లేదు. పక్కా క్లారిటీతో వచ్చి ప్రాణాలు తీసుకెళ్తుంది. ప్రపంచం అంతా ఇప్పుడు దాని భయంతోనే బతుకుతోంది. ప్రస్తుతం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే భయం తెప్పించే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ మహమ్మారి. మెల్లగా మహమ్మారి బారిన పడుతున్న బాధితుల సంఖ్య వేలలో ఉంటోంది. ఇది వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలు తమకు తాముగా జాగ్రత్తలు పాటించాల్సిందే తప్ప మరో మార్గం లేదని వైద్యులు కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కూడా ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి అభిమానులకు సోషల్ మీడియా వేదికగా కొన్ని సలహాలు అందించారు. ఇక ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ ఫ్రెండ్ శిల్పా రెడ్డి కరోనా బారిన పడి మహమ్మారి పై విజయం సాధించింది. ఆమెతో పాటు భర్తకు కూడా కరోనా వచ్చింది. కానీ మానసికంగా, శారీరకంగా, దృఢంగా ఉండటమే ప్రతి ఒక్కరికి ప్రధాన అయుధమని వివరించింది శిల్పారెడ్డి. అవును అదే నిజం అంటున్నారు నాగార్జున.

చికిత్స సమయంలో తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఆమె ఓ వీడియో చేసింది. దీన్ని నాగార్జున తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా వినండి అంటూ ఫ్యాన్స్‌కు సూచించాడు. ఈ వీడియోలో కరోనా సోకిడానికి గల కారణాలను శిల్పారెడ్డి వివరించింది. తనకు, తన భర్తకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కూడా కాస్త అస్వస్థతకు లోనవ్వడంతో వెంటనే పరీక్షలు చేయించుకున్నామని తెలిపింది. దాంతో తమకు పాజిటివ్‌గా నిర్దారణ అయిందని.. ఆ తర్వాత తగిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారం, డైట్‌ పాటించి కరోనాను జయించామని వీడియోలో చెప్పింది శిల్పారెడ్డి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలని.. అంతే కాకుండా ప్రతిరోజు తప్పకుండా ఎక్సర్‌సైజ్ కూడా ముఖ్యమే అని చెప్పుకొచ్చింది శిల్పారెడ్డి. ఈమె చెప్పినట్లు చేస్తే కరోనా రాదంటూ నాగార్జున అభిమానులకు ట్వీట్ చేసాడు. ప్రస్తుతం నాగ్ ఫ్యాన్స్ అంతా ఈ వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు.